Trump: తక్షణమే పౌరులు టెహ్రాన్ ఖాళీ చేయండి.. ట్రంప్ పిలుపు
- తక్షణమే పౌరులు టెహ్రాన్ ఖాళీ చేయండి
- ఇరానీయులకు ట్రంప్ పిలుపు
- జీ7 సదస్సు కుదించుకున్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులు ఎక్కడకి దారి తీస్తాయేమోనని ప్రపంచ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టెహ్రాన్ ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే టెహ్రాన్ను ఖాళీ చేయాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Hyderabad: ఇప్పట్లో ఆగేలా లేరే.. ఆసిఫ్ నగర్ లో భర్తపై ప్రియుడితో కలిసి భార్య దాడి..
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఇప్పటికైనా ఇరాన్కు సమయం మించిపోలేదని.. అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. కెనడా వేదికగా జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందాన్ని అంగీకరించాల్సి ఉండాల్సిందని వ్యాఖ్యనించారు. మరింత సమయం ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని.. ఇప్పటికే రెండో అవకాశం ఇచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ట్రంప్ గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Mukul Dev : ముకుల్ దేవ్ మృతి పై.. సోదరుడు రాహుల్ దేవ్ ఎమోషనల్ రియాక్షన్
‘‘నేను చెప్పిన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సింది. ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య. ఇంకాస్త సులువుగా చెప్పాలంటే.. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయలేదు. ఇప్పటికే పదే పదే చెప్పా. అందరూ టెహ్రాన్ను ఖాళీ చేయాలి’’ అని ట్రంప్ పోస్టు చేశారు. ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ జీ 7 సదస్సు కుదించుకుని అమెరికా వచ్చేస్తున్నట్లు వైట్హౌస్ తెలిపింది. ట్రంప్ తన జాతీయ భద్రతా మండలిని సమావేశపరుస్తారని ఫాక్స్ న్యూస్ నివేదించింది.
ఇదిలా ఉంటే మంగళవారం తెల్లవారుజామున కూడా టెహ్రాన్లో భారీ పేలుళ్లు సంభవించాయి. భారీ వైమానిక దాడులు జరిగాయి. ఈ మేరకు ఇరాన్ మీడియా తెలిపింది. 320 కి.మీ దూరంలో ఉన్న అణు స్థాపనకు నిలయమైన నటాంజ్లో వైమానిక దాడులు జరిగినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించేలా ట్రంప్పై ఒత్తిడి తీసుకురావాలని ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలను ట్రెహాన్ కోరినట్లు రాయిటర్స్ వర్గాలు తెలిపాయి.

22
తాజావార్తలు
-
KS Bharat Retirement: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్..
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..