Pakistan: ఇమ్రాన్ ఖాన్కు పదవీగండం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో ముగిపోవడంతో.. ఆయనకు పదవీ గండం తప్పేలా లేదు. ఇమ్రాన్ఖాన్కు వ్యతిరేకంగా సొంత పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే 25 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నారు. ఈ నెలాఖరులో.. ఇమ్రాన్ఖాన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం కారణంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఇప్పటికే అక్కడి ప్రజలు ఆయన పాలన పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ దేశంలో ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని.. దేశంలో నిత్యవసరాల ధరలు, నిరుద్యోగం పెరిగి పోతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: Ukraine Russia War: రష్యా దాడుల్లో హీరోయిన్ మృతి..
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
అయితే, అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ నెగ్గడం కష్టంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం 342 మంది సభ్యులున్న పాకిస్తాన్ పార్లమెంట్లో.. 172 మంది ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక సైన్యంకూడా ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. ఈ ప్రభావం ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ క్రికెట్ సిరీస్పైనా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇమ్రాన్కు వ్యతిరేకంగా ఇస్లామాబాద్లో భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఇంకోవైపు… ఈ నెల 29 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఒక టీ-20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా క్రికెటర్లు బస చేసే హోటల్కు సమీపంలోనే ఆ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో సిరీస్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు వ్యకమౌతున్నాయి. అయితే, ఆస్ట్రేలియాతో సిరీస్ వేదికను ఇస్లామాబాద్ నుంచి లాహోర్కు మార్చే ఆలోచనలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు-పీసీబీ ఉన్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..