Chocolate: ప్రముఖ చాక్లెట్పై షాకింగ్ న్యూస్.. ఇకపై తినే ముందు జాగ్రత్త!
- చాక్లెట్ ప్రియులకు షాకింగ్ న్యూస్
- విష పదార్ధాలు గుర్తించిన అధ్యయన బృందం
- ఇకపై జాగ్రత్తగా ఉండాలని పరిశోధకుడు హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాక్లెట్ అంటే పిల్లల దగ్గర నుంచి అన్ని వయసుల వారు ఇష్టపడని వాళ్లు ఉండరు. అది కనిపిస్తే చాలు.. లాలాజలం ఊరిపోతుంది. అంతగా ఇష్టపడేవాళ్లుంటారు. కనీసం రోజుకు ఒకటైనా తినకుండా ఉండరు. అంతగా ఇష్టపడి తినే చాక్లెట్ గురించి తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ షాకింగ్ న్యూస్ తెలియాలంటే ఈ వార్త చదవండి.
ప్రముఖ కోకో ఉత్పత్తుల నుంచి తయారయ్యే ఆహారాల్లో సీసం, కాడ్మియం వంటి విషపూరిత భారీ లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో తేటతెల్లమైంది. డార్క్ చాక్లెట్తో సహా 72 కోకో ఆధారిత ఆహారాలను ఎనిమిది సంవత్సరాల పాటు పరిశోధకులు నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ మర్మం బయటపడింది. ఈ ఉత్పత్తుల్లో 43 శాతం సీసం, 35 శాతం కాడ్మియం అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఇది గుండె.. ఇతర అవయవాలకు ప్రమాదమని తేల్చింది.
Also Read
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Sheikh Hasina: "నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు": షేక్ హసీనా
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
కోకో ఉత్పత్తుల్లో విష పదార్థాలు గుర్తించినట్లుగా ప్రధాన పరిశోధకుడైన లీ ఫ్రేమ్ వెల్లడించారు. ఈయన జీడబ్ల్యూ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్లో ఇంటిగ్రేటివ్ మెడిసిన్ డైరెక్టర్ మరియు క్లినికల్ రీసెర్చ్ అండ్ లీడర్షిప్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ ఆహార పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇటువంటి వాటి పట్ల దూరంగా ఉండాలని సూచించారు.
సీసం అధికంగా ఉండడంతో అధిక రక్తపోటు, మెదడు, మూత్రపిండాలు, పునరుత్పత్తి వ్యవస్థకు హాని కలిగించవచ్చని చెప్పారు. అంతేకాకుండా తలనొప్పి, కడుపు తిమ్మిరి, మలబద్ధకం, కండరాలు/కీళ్ల నొప్పి, నిద్రకు ఇబ్బంది, అలసట, చిరాకు, సెక్స్ డ్రైవ్ కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇక కాడ్మియం విషపూరితం కారణంగా చలి, జ్వరం, కండరాల నొప్పికి కారణమవుతుందన్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక ఎక్స్పోజర్ మూత్రపిండాలు, ఎముకలు, ఊపిరితిత్తుల వ్యాధికి దారి తీస్తుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: 4 నిమిషాల పైగా ఊచకోత.. బాక్సాఫీస్ వద్ద విధ్వంసానికి టైం ఫిక్స్.. అర్ధరాత్రి #NTRNeel బర్త్డే గిఫ్ట్!
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!