Chocolate: ప్రముఖ చాక్లెట్పై షాకింగ్ న్యూస్.. ఇకపై తినే ముందు జాగ్రత్త!
- చాక్లెట్ ప్రియులకు షాకింగ్ న్యూస్
- విష పదార్ధాలు గుర్తించిన అధ్యయన బృందం
- ఇకపై జాగ్రత్తగా ఉండాలని పరిశోధకుడు హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాక్లెట్ అంటే పిల్లల దగ్గర నుంచి అన్ని వయసుల వారు ఇష్టపడని వాళ్లు ఉండరు. అది కనిపిస్తే చాలు.. లాలాజలం ఊరిపోతుంది. అంతగా ఇష్టపడేవాళ్లుంటారు. కనీసం రోజుకు ఒకటైనా తినకుండా ఉండరు. అంతగా ఇష్టపడి తినే చాక్లెట్ గురించి తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ షాకింగ్ న్యూస్ తెలియాలంటే ఈ వార్త చదవండి.
ప్రముఖ కోకో ఉత్పత్తుల నుంచి తయారయ్యే ఆహారాల్లో సీసం, కాడ్మియం వంటి విషపూరిత భారీ లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో తేటతెల్లమైంది. డార్క్ చాక్లెట్తో సహా 72 కోకో ఆధారిత ఆహారాలను ఎనిమిది సంవత్సరాల పాటు పరిశోధకులు నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ మర్మం బయటపడింది. ఈ ఉత్పత్తుల్లో 43 శాతం సీసం, 35 శాతం కాడ్మియం అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఇది గుండె.. ఇతర అవయవాలకు ప్రమాదమని తేల్చింది.
Also Read
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
- ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
కోకో ఉత్పత్తుల్లో విష పదార్థాలు గుర్తించినట్లుగా ప్రధాన పరిశోధకుడైన లీ ఫ్రేమ్ వెల్లడించారు. ఈయన జీడబ్ల్యూ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్లో ఇంటిగ్రేటివ్ మెడిసిన్ డైరెక్టర్ మరియు క్లినికల్ రీసెర్చ్ అండ్ లీడర్షిప్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ ఆహార పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇటువంటి వాటి పట్ల దూరంగా ఉండాలని సూచించారు.
సీసం అధికంగా ఉండడంతో అధిక రక్తపోటు, మెదడు, మూత్రపిండాలు, పునరుత్పత్తి వ్యవస్థకు హాని కలిగించవచ్చని చెప్పారు. అంతేకాకుండా తలనొప్పి, కడుపు తిమ్మిరి, మలబద్ధకం, కండరాలు/కీళ్ల నొప్పి, నిద్రకు ఇబ్బంది, అలసట, చిరాకు, సెక్స్ డ్రైవ్ కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇక కాడ్మియం విషపూరితం కారణంగా చలి, జ్వరం, కండరాల నొప్పికి కారణమవుతుందన్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక ఎక్స్పోజర్ మూత్రపిండాలు, ఎముకలు, ఊపిరితిత్తుల వ్యాధికి దారి తీస్తుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!