Indonesia Earthquake: ఇండోనేషియా భూకంపంలో 252కు చేరిన మృతులు.. అండగా ఉంటామన్న ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toll From Indonesia Earthquake Reaches 252: ఇండోనేషియా భూకంపంలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ భూకంపంలో ఇప్పటి వరకు 252 మంది మరణించారు. మంగళవారం ఇండోనేషియా ప్రభుత్వం మరణాల సంఖ్యను వెల్లడించింది. మరో 31 మంది గల్లంతయ్యారని.. 377 మంది గాయపడ్డారని వెల్లడించింది. భూకంపం వల్ల 7,060 మంది ప్రజలు చెల్లచెదురయ్యారు.
ఇండోనేషియా పశ్చిమ జావాలోని సియాంజూర్ పట్టణంలో భూకంపం సంభవించడం వల్ల భారీగా ప్రాణనష్టం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.6 తీవ్రతతో భూకంపం రావడం వల్ల ప్రజలు ప్రాణాలు పోయాయి. ప్రస్తుతం శిథిలాల కింద మరింత మంది చిక్కుకుపోయి ఉన్నారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది పనిచేస్తోంది. సోమవారం భూకంపం రాజధాని జకర్తాలకు ఆగ్నేయంగా 75 కిలోొమీటర్ల దూరంలో ఉన్న సియాంజూర్ లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
Read Also: Saudi Arabia: 12 మంది తల నరికి, ఉరితీసిన సౌదీ అరేబియా
భూకంపం బారిన పడిని ఇండోనేషియాకు ప్రపంచదేశాలు బాసటగా నిలుస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఇండోనేషియాకు అండగా ఉంటామని ప్రకటించారు. ‘‘ఇండోనేషియా భూకంపంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగడం బాధాకరం.. బాధితులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని.. ఈ దు:ఖ సమయంలో ఇండోనేషియాకు భారత్ అండగా ఉంటుంది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధానితో పాటు బ్రిటన్ ప్రధాని రిషి సునక్, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సంతాపం వ్యక్తం చేశారు.
ఇండోనేషియాలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇండోనేషియా సముద్రంలో అగ్నిపర్వతాలు అధికంగా ఉంటాయి. ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలోని ‘‘ రింగ్ ఆఫ్ ఫైర్’’ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా టెక్టానిక్ ప్లేట్ కదలికలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ పలకల మధ్య ఘర్షణ, అగ్నిపర్వతాల విస్పోటనం కారణంగా ఇండోనేషియా భూకంపాలు, సునామీల బారిన పడుతుంటుంది.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!