Indonesia Earthquake: ఇండోనేషియా భూకంపంలో 252కు చేరిన మృతులు.. అండగా ఉంటామన్న ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toll From Indonesia Earthquake Reaches 252: ఇండోనేషియా భూకంపంలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ భూకంపంలో ఇప్పటి వరకు 252 మంది మరణించారు. మంగళవారం ఇండోనేషియా ప్రభుత్వం మరణాల సంఖ్యను వెల్లడించింది. మరో 31 మంది గల్లంతయ్యారని.. 377 మంది గాయపడ్డారని వెల్లడించింది. భూకంపం వల్ల 7,060 మంది ప్రజలు చెల్లచెదురయ్యారు.
ఇండోనేషియా పశ్చిమ జావాలోని సియాంజూర్ పట్టణంలో భూకంపం సంభవించడం వల్ల భారీగా ప్రాణనష్టం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.6 తీవ్రతతో భూకంపం రావడం వల్ల ప్రజలు ప్రాణాలు పోయాయి. ప్రస్తుతం శిథిలాల కింద మరింత మంది చిక్కుకుపోయి ఉన్నారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది పనిచేస్తోంది. సోమవారం భూకంపం రాజధాని జకర్తాలకు ఆగ్నేయంగా 75 కిలోొమీటర్ల దూరంలో ఉన్న సియాంజూర్ లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Read Also: Saudi Arabia: 12 మంది తల నరికి, ఉరితీసిన సౌదీ అరేబియా
భూకంపం బారిన పడిని ఇండోనేషియాకు ప్రపంచదేశాలు బాసటగా నిలుస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఇండోనేషియాకు అండగా ఉంటామని ప్రకటించారు. ‘‘ఇండోనేషియా భూకంపంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగడం బాధాకరం.. బాధితులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని.. ఈ దు:ఖ సమయంలో ఇండోనేషియాకు భారత్ అండగా ఉంటుంది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధానితో పాటు బ్రిటన్ ప్రధాని రిషి సునక్, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సంతాపం వ్యక్తం చేశారు.
ఇండోనేషియాలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇండోనేషియా సముద్రంలో అగ్నిపర్వతాలు అధికంగా ఉంటాయి. ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలోని ‘‘ రింగ్ ఆఫ్ ఫైర్’’ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా టెక్టానిక్ ప్లేట్ కదలికలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ పలకల మధ్య ఘర్షణ, అగ్నిపర్వతాల విస్పోటనం కారణంగా ఇండోనేషియా భూకంపాలు, సునామీల బారిన పడుతుంటుంది.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!