Iran: ఇరాన్లో ముగ్గురు భారతీయులు అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
- ఇరాన్లో ముగ్గురు భారతీయులు అదృశ్యం
- ఆందోళనలో కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బతుకుదెరువు కోసం ఇరాన్ వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు. దీంతో వారి జాడ తెలియక కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. తమ బిడ్డల జాడ గుర్తించాలని ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు సంప్రదించారు.
ఇది కూడా చదవండి: Yuva Galam Padayatra Book: గత ప్రభుత్వ అరాచక పాలనపై పుస్తకం.. సీఎంకు అందజేసిన నారా లోకేష్
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
అదృశ్యమైన వ్యక్తులు పంజాబ్కు చెందిన హుషన్ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్బీఎస్ నగర్), అమృతపాల్ సింగ్ (హోషియార్పూర్)గా గుర్తించారు. హోషియార్పూర్ ఏజెంట్ సాయంతో మే 1న ఇరాన్ వెళ్లారు. ఇరాన్లోకి అడుగుపెట్టగానే దుండగులు బంధించి వాళ్లను తాళ్లతో కట్టి.. కుటుంబ సభ్యులకు ఫొటోలు పంపించి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మే 11 నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో టెహ్రాన్లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు సంప్రదించారు. దీంతో ఎంబసీ అధికారులు.. ఇరాన్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. భారతీయుల జాడ గుర్తించాలని కోరారు. ఇక ఎప్పటికప్పుడు సమాచారాన్ని కుటుంబ సభ్యులతో ఎంబసీ పంచుకుంటోంది. ఇన్ని రోజులైనా తమ పిల్లల జాడ ఇంకా తెలియకపోవడంతో భయాందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి: Rythu Bharosa : రైతు భరోసాపై కీలక ప్రకటన.. అకౌంట్లో డబ్బులు అప్పుడే.!
పంజాబ్లోని హోషియార్పూర్ ఏజెంట్ దుబాయ్-ఇరాన్ మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతానని ముగ్గురికి హామీ ఇచ్చి తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరికి ఇరాన్లో బస కల్పిస్తున్నట్లు ఏజెంట్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ మే 1న ఇరాన్లో అడుగుపెట్టగానే ముగ్గురు కిడ్నాప్నకు గురయ్యారు. ఇక అప్పటినుంచి ఏజెంట్ జాడ కూడా పత్తాలేకుండాపోయింది. అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఏజెంట్ ఆచూకీ తెలిస్తే.. తమ బిడ్డలు ఎక్కడున్నారన్నది తెలుస్తుందని చెబుతున్నారు. కిడ్నాపర్లు రూ.కోటి ఇవ్వాలని ఫోన్ చేసి బెదిరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ముగ్గురి జాడ కోసం ఇరాన్ అధికారులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!