Afghanistan: మహిళలు చదువు కోవాలంటే ఆఫ్ఘాన్ లోనే.. విదేశాలకు నో అంటున్న తాలిబన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban refuses female students to leave Kabul for studies: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలన ప్రారంభం అయి ఏడాది గడిచింది. 2021 ఆగస్టులో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. అప్పటి నుంచి స్త్రీలపై వివక్ష చూపిస్తున్నారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం అవుతున్నారు. స్త్రీ విద్యను వ్యతిరేకిస్తున్నారు. మహిళలు ఇళ్ల నుంచి బయటకు వెళ్తే ఖచ్చితంగా కుటుంబంలోని మగవాళ్ల తోడు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. షరియా చట్టాన్ని అమలు చేయడానికే తాలిబన్లు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే మహిళా విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి అనుమతి నిరాకరిస్తున్నారు తాలిబన్ పాలకులు. అయితే చాలా మంది విద్యార్థిని, విద్యార్థులు రాజధాని కాబూల్ ను వదిలి వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేవలం మగవాళ్లకు అనుమతి ఇచ్చి మహిళా విద్యార్థినులకు పర్మిషన్ ఇవ్వడం లేదు. కనీసం ఆఫ్ఘానిస్తాన్ లో మహిళలు బయటకు వెళ్లి పని చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదు తాలిబన్ ప్రభుత్వం. కొన్ని ప్రావిన్సుల్లో మాత్రం అక్కడక్కడ విద్యను అభ్యసించడానికి అనుమతించారు. అది కూడా కఠిన నిబంధనల మధ్య. ఆడపిల్లలు కేవలం ఆరో తరగతికి మించి చదువుకోకూడదని ఆదేశాలు ఇస్తున్నారు.
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
Read Also: KTR: నా పేరుతో కొట్టుకు చావండి అని ఏ దేవుడు చెప్పాడు..? నా దృష్టిలే అమ్మే నా దేవత..!
ప్రస్తుతం మహిళలు, బాలికలు ఆఫ్ఘాన్ వదిలి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత దేశంలో మహిళలు ఉద్యోగాలు చేయకుండా నిరోధించారు.. మహిళా హక్కులకు అసలు విలువే లేదు. దీంతో పాటు బాలికల నిర్భందం, బలవంతపు వివాహాలు పెరిగాయి. అనాగరిక చట్టాలను అమలు చేస్తుండటంతో విదేశాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు సాయం దక్కడం లేదు. అధికారం చేజిక్కించుకునే ముందు బాలిక విద్యా, హక్కుల గురించి హామీలు ఇచ్చిన తాలిబన్లు ఆ తరువాత వీటిని పట్టించుకోవడం లేదు. మరో వైపు పేదరికం పెరిగింది.దీంతో ప్రజలు కిడ్నీలను అమ్ముకుంటున్నారు.. తమ పిల్లలను కూడా అమ్ముకునే దుస్థితి దాపురించింది. తాలిబాన్ పాలనలో మహిళలు స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడాన్ని వ్యతిరేకించారు. ఆఫ్ఘన్ మీడియాలో పని చేస్తున్న 80 శాతం మహిళలు ఉద్యోగాలను కోల్పోయారు. దేశంలో 1.8 కోట్ల మంది మహిళలు ఆరోగ్యం, విద్య, సామాజిక హక్కులకు దూరం అవుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!