మగాళ్లు గడ్డం గీసుకోవడం నేరమే : తాలిబన్ల కొత్త రూల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్ఘాన్లో మగాళ్లకు గడ్డం ప్రాణ గండంగా మారింది. గడ్డం గొరిగిస్తే, ప్రాణం తీస్తామంటున్నారు తాలిబన్లు. షరియత్ చట్టాల్లో షేవింగ్కు స్థానం లేదంటూ బార్బర్ షాప్లకు వార్నింగ్లు పంపించారు. అయినా గడ్డం గీస్తే అడ్డంగా నరికేస్తామని నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో కొసాగిన అరాచక పాలనను మళ్లీ అమలులోకి తీసుకొచ్చారు తాలిబన్లు. కాబూల్లో తాలిబన్లు అడుగు పెట్టగానే ఆ దేశ ప్రజలు వేలాది మంది ఎందుకు పారిపోయారో ప్రపంచానికి ఇప్పుడర్థమవుతోంది. 1996 నుంచి 2001 వరకు కాలకేయుల పాలనలో నరకం అనుభవించిన అమాయక అప్ఘానీలకు ఇప్పుడు మళ్లీ అవే కష్టాలు వచ్చిపడ్డాయి.
షరియత్ పేరు చెబుతూ రోజుకో హింసాత్మక విధనాన్ని ప్రజల మీద బలంగా రుద్దుతున్నారు. కిడ్నాప్ నెపంతో హెరాత్ ప్రావిన్స్లో మొన్న నలుగురు యువకులను కాల్చి చంపి, క్రెయిన్లకు వేళాడదీసిన కాళకేయులు, ఇప్పుడు తాజాగా మరో రూల్ను తీసుకొచ్చారు. అప్ఘానిస్తాన్లో మగాళ్లు గడ్డం గీసుకోవడం నేరం అని హెల్మాండ్ ప్రావిన్స్లో ఫత్వా జారీ చేశారు. తాలిబన్ల కొత్త రూల్తో దేశంలని బార్బర్షాపుల ఓనర్ల ఒళ్లంత చెమటలు పట్టిపోయాయి. అంతేకాదు తమ రూల్పై ఫిర్యాదు చేసే అధికారం ఎవరికీ లేదని కూడా ఆర్డర్ పాస్ చేశారు.
Also Read
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
హెల్మాండ్లో జారీచేసిన ఫత్వా ఎఫెక్ట్ కాబూల్లోనూ కనిపించింది. అనేక మంది బార్బర్షాపుల ఓనర్లు ఇప్పటికే షెట్టర్ దించేశారు. కొందరికైతే తాలిబన్లు నేరుగా ఫోన్లు చేసి మరీ బెదిరించారు. దుకాణాలు మూసుకోవాడం తప్ప మరో దారి కనిపించడం లేదని బోరుమంటున్నారు బార్బర్ షాపుల ఓనర్లు. 2001లో తాలిబన్లు పారిపోయిన తర్వాత ఇక్కడ అమెరికన్ హెయిర్ కటింగ్ స్టైల్లు పాపులర్ అయ్యాయి. వెస్ట్రన్ బలగాలతోపాటు, వారి కల్చర్ను కూడా ఒంటపట్టించుకున్నారు అనేక మంది అప్గానీలు. ఆడవాళ్లు తమ అందాన్న మెరుగు పర్చుకోడానికి బ్యూటీ పార్లర్లకు వచ్చేవాళ్లు. హెయిర్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లతో పదిహేనేళ్లుగా ఉపాధి పొందిన అనేక మంది ఇప్పుడు ఆకలి చావులు చావాల్సి వచ్చింది. అసలే ఉపాది లేక ఇళ్లలో ఉన్న వస్తువులను అమ్ముకుని బతుకుతున్న అప్ఘానీలకు తాలిబన్ల తలతిక్క నిర్ణయాలు ప్రాణమీదకు తెస్తున్నాయి.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!