Srilanka Crisis: దయచేసి అప్పు ఇవ్వండి.. ఇండియాను కోరిన శ్రీలంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక పరిస్థితి ఇప్పట్లో కుదుటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ ఆ దేశం అప్పుల్లో కూరుకుపోయింది. నిత్యావసరాల కోసం కొనేందుకు జనాల దగ్గర డబ్బులు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దేశ ఖజానా మొత్తం పూర్తిగా దివాళా తీసింది. ప్రస్తుతం శ్రీలంక విదేశాల ఇచ్చే సాయంపైనే ఆధారపడింది. ప్రజల ఆగ్రహావేశాల మధ్య గతంలో ప్రధానిగా ఉన్న మహిందా రాజపక్సే రాజీనామా చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రణిల్ విక్రమసింఘే శ్రీలంకలో ఆహార సంక్షోభాన్ని హెచ్చరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే ఇటీవల శ్రీలంక వ్యవసాయ మంత్రి ఆ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వరిని పండించాలని కోరారు. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి అవసరమైన ఎరువులు కొనేందుకు కూడా శ్రీలంక వద్ద డబ్బులు లేవు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎరువుల కోసం ఇండియా నుంచి శ్రీలంక 55 మిలియన్ డాలర్ల రుణాన్ని కోరింది. ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా యూరియాను కొనుగోలు చేసేందుకు శ్రీలంకకు 55 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇండియా ఇవ్వడానికి అంగీకరించిందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు సత్వర చర్యలు చేపడితే..ఐదారు నెలల్లో ప్రస్తుత వ్యవసాయ కొరతను తీర్చగలమని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే తెలిపారు.
Also Read
- Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
- Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. "మహామంత్రం" జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
- Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
- XI Jinping: చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు గుండెపోటు..? వారసుడిని ప్రకటిస్తే తిరుగుబాటు భయం.?
రసాయన ఎరువులను దిగుమతులను నిషేధిస్తూ శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తీసుకున్న నిర్ణయం శ్రీలంక ఆహార సంక్షోభానికి కారణం అయింది. దీంతో దేశంలో ఆహార పంటల ఉత్పత్తి గణనీయంగా 50 శాతానికి తగ్గింది. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. 1945 లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత శ్రీలంక ఇటువంటి ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోలేదు. ఆహారం, ఔషధాల, వంటగ్యాస్, టాయిలెట్ పేపర్, అగ్గిపెట్టె వంటి నిత్యావసరాలకు కూడా తీవ్ర కొరత ఏర్పడింది. ప్రజల పెట్రోల్, డిజిల్ కోసం గంటల తరబడి క్యూల్లో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
-
Kia Syros Flex Fuel: 100% ఇథనాల్తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
-
Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
-
YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
-
Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!