Sri Lanka Economic Crisis: చేతులెత్తేసిన శ్రీలంక.. అప్పులు చెల్లించలేం..
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక చేతులెత్తేసింది.. అప్పులు కట్టడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ తేల్చేసింది… ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా కోసం ఒత్తిడి పెరుగుతోంది. అధ్యక్షుడి సెక్రటేరియట్ వద్ద నిరసనలు హోరెత్తాయి. నిరసనకారులు ‘గో హోమ్ గొట’ అంటూ అధ్యక్షుడి రాజీనామా కోసం పెద్దపెట్టున నినాదాలు చేశారు. తమకు కరెంట్, గ్యాస్, పెట్రోల్, మెడిసిన్ లేవు… అందుకే ఆందోళన చేస్తున్నామని తెలిపారు. రాజపక్సే రాజీనామా చేయాల్సిందేనని నిరసనకారులు పట్టుబట్టారు. అయితే, అధ్యక్షుడి రాజీనామా కోసం డిమాండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రతిపక్ష పార్టీలు దేశాన్ని అరాచకంలోకి నెట్టేస్తున్నాయని శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న సమయంలో ‘కొవిడ్ లాక్డౌన్’కారణంగా విదేశీ మారక నిల్వలు మరింత క్షీణించాయని మహింద రాజపక్స పేర్కొన్నారు. ఇదే సమయంలో.. శ్రీలంక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది..
Read Also: Peddireddy: పవర్ హాలిడే లేకుండా చేయడమే లక్ష్యం..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
విదేశాలకు చెల్లించాల్సిన $51 బిలియన్ల విదేశీ రుణాన్ని చెల్లించలేదు శ్రీలంక.. 1948లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అత్యంత బాధాకరమైన తిరోగమనంలో ఉన్న ఆ దేశంలో 22 మిలియన్ల మంది ప్రజలకు విద్యుత్, ఆహారం, ఇంధనం అన్నీ సమస్యగా మారాయి.. అంతర్జాతీయ మానిటరీ ఫండ్ బెయిలౌట్కు ముందు దేశం.. విదేశీ ప్రభుత్వాల నుండి రుణాలతో సహా అన్ని బాహ్య బాధ్యతలపై డిఫాల్ట్ అవుతుందని శ్రీలంక ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది… తమ ఆర్థిక స్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి ప్రభుత్వం చివరి ప్రయత్నంగా మాత్రమే అత్యవసర చర్యను తీసుకుంటుందని తెలిపింది.. రుణదాతలు తమకు చెల్లించాల్సిన ఏవైనా వడ్డీ చెల్లింపులను క్యాపిటలైజ్ చేసుకోవచ్చు లేదా శ్రీలంక రూపాయల్లో చెల్లింపును ఎంచుకోవచ్చు అని వెల్లడించింది. ప్రభుత్వం తన విదేశీ కరెన్సీ నిల్వలను కాపాడుకోవడానికి మరియు ఇప్పుడు డిఫాల్ట్ చేసిన అప్పులను తీర్చడానికి వాటిని ఉపయోగించడానికి దిగుమతి నిషేధాన్ని విధించింది. అయితే, ప్రభుత్వ నిర్వహణ లోపం, సంవత్సరాల తరబడి పేరుకుపోయిన రుణాలు, అనాలోచిత పన్ను తగ్గింపుల వల్ల సంక్షోభం మరింత తీవ్రమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!