Sri Lanka Economic Crisis: చేతులెత్తేసిన శ్రీలంక.. అప్పులు చెల్లించలేం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక చేతులెత్తేసింది.. అప్పులు కట్టడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ తేల్చేసింది… ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా కోసం ఒత్తిడి పెరుగుతోంది. అధ్యక్షుడి సెక్రటేరియట్ వద్ద నిరసనలు హోరెత్తాయి. నిరసనకారులు ‘గో హోమ్ గొట’ అంటూ అధ్యక్షుడి రాజీనామా కోసం పెద్దపెట్టున నినాదాలు చేశారు. తమకు కరెంట్, గ్యాస్, పెట్రోల్, మెడిసిన్ లేవు… అందుకే ఆందోళన చేస్తున్నామని తెలిపారు. రాజపక్సే రాజీనామా చేయాల్సిందేనని నిరసనకారులు పట్టుబట్టారు. అయితే, అధ్యక్షుడి రాజీనామా కోసం డిమాండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రతిపక్ష పార్టీలు దేశాన్ని అరాచకంలోకి నెట్టేస్తున్నాయని శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న సమయంలో ‘కొవిడ్ లాక్డౌన్’కారణంగా విదేశీ మారక నిల్వలు మరింత క్షీణించాయని మహింద రాజపక్స పేర్కొన్నారు. ఇదే సమయంలో.. శ్రీలంక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది..
Read Also: Peddireddy: పవర్ హాలిడే లేకుండా చేయడమే లక్ష్యం..
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
విదేశాలకు చెల్లించాల్సిన $51 బిలియన్ల విదేశీ రుణాన్ని చెల్లించలేదు శ్రీలంక.. 1948లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అత్యంత బాధాకరమైన తిరోగమనంలో ఉన్న ఆ దేశంలో 22 మిలియన్ల మంది ప్రజలకు విద్యుత్, ఆహారం, ఇంధనం అన్నీ సమస్యగా మారాయి.. అంతర్జాతీయ మానిటరీ ఫండ్ బెయిలౌట్కు ముందు దేశం.. విదేశీ ప్రభుత్వాల నుండి రుణాలతో సహా అన్ని బాహ్య బాధ్యతలపై డిఫాల్ట్ అవుతుందని శ్రీలంక ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది… తమ ఆర్థిక స్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి ప్రభుత్వం చివరి ప్రయత్నంగా మాత్రమే అత్యవసర చర్యను తీసుకుంటుందని తెలిపింది.. రుణదాతలు తమకు చెల్లించాల్సిన ఏవైనా వడ్డీ చెల్లింపులను క్యాపిటలైజ్ చేసుకోవచ్చు లేదా శ్రీలంక రూపాయల్లో చెల్లింపును ఎంచుకోవచ్చు అని వెల్లడించింది. ప్రభుత్వం తన విదేశీ కరెన్సీ నిల్వలను కాపాడుకోవడానికి మరియు ఇప్పుడు డిఫాల్ట్ చేసిన అప్పులను తీర్చడానికి వాటిని ఉపయోగించడానికి దిగుమతి నిషేధాన్ని విధించింది. అయితే, ప్రభుత్వ నిర్వహణ లోపం, సంవత్సరాల తరబడి పేరుకుపోయిన రుణాలు, అనాలోచిత పన్ను తగ్గింపుల వల్ల సంక్షోభం మరింత తీవ్రమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..