Pakistan: భారత్పై మేమే గెలిచాం.. యూఎన్లో పాక్ పీఎం అబద్ధాలు..
- యూఎన్ వేదికగా పాకిస్తాన్ ప్రధాని అబద్ధాలు..
- భారత్పై తామే గెలిచామంటూ ప్రగల్భాలు..
- పహల్గామ్ అంశాన్ని భారత్ రాజకీయం చేసిందని ఆరోపణ..
- పాకిస్తాన్ శాంతి కోరుకునే దేశమని కామెడీ చేసిన షెహబాజ్ షరీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: శుక్రవారం రోజు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్పై విషం వెళ్లగక్కాడు. ఐక్యరాజ్యసమితి వేదికగా అన్ని అబద్ధాలనే ప్రచారం చేశాడు. జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశంపై తామే గెలిచామంటూ, భారతదేశాన్ని శత్రువుగా అభివర్ణించాడు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని పేర్కొన్నాడు. పహల్గామ్ దాడిపై నిష్పాక్షిక అంతర్జాతీయ దర్యాప్తు కోసం తాను విజ్ఞప్తి చేశానని, కానీ భారతదేశం ఆ ప్రతిపాదనను తిరస్కరించి, ఈ విషాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకుందని ఆరోపించాడు.
Read Also: Pakistan: హిందుత్వం ప్రపంచానికి ప్రమాదమట.. భారత్పై విషం కక్కిన దాయాది దరిద్రుడు..
Also Read
- Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
పాకిస్తాన్పై ఎలాంటి బాహ్యదాడిని తాము సహించేది లేదని గతేడాది యూఎన్లో చెప్పానని, ఇప్పుడు అదే నిజమైందని అన్నారు. ఈ ఏడాది మేలో పాకిస్తాన్ నుంచి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే దాడి జరిగిందని భారత్పై ఆరోపణలు గుప్పించాడు. ఈ సంఘర్షణ సమయంలో పాకిస్తాన్ బలమైన స్థానంలో ఉన్నప్పటికీ, కాల్పుల విరమణకు మద్దతు ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో ఈ ప్రాంతంలో ఒక పెద్ద యుద్ధం ఆగిందని పొగడ్తలు కుపించాడు. ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదించాడు.
వివాదాస్పద అంశాలపై భారత్తో చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని, దక్షిణాసియాకు వివేకవంతమైన నాయకులు అవసరమని, రెచ్చగొట్టే నాయకులు కాదని అన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపేసిందని చెప్పారు. ఇది అంతర్జాతీయ చట్టాన్ని కూడా ఉల్లంఘించడమే అని అన్నారు.పాకిస్తాన్ తన 240 మిలియన్ల ప్రజల నీటి హక్కులను కాపాడుతుందని, సింధు జల ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని చెప్పారు. కాశ్మీర్ ప్రజలకు తాము అండగా నిలుస్తామని అన్నారు. ఐక్యరాజ్యసమితి చట్టం ప్రకారం ఒక రోజు కాశ్మీర్లో న్యాయమైన ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని, కాశ్మీరీలు స్వయంగా నిర్ణయించుకునే అధికారం పొందుతారని తాను విశ్వసిస్తున్నానని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!