Site icon NTV Telugu

Pakistan: వచ్చే వారం ట్రంప్‌తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భేటీ..

Trump

Trump

Pakistan: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా సెప్టెంబర్ 25న ఇద్దరు పాక్ నాయకులు ట్రంప్‌తో చర్చలు జరుపుతారని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. నివేదికల ప్రకారం, పాకిస్తాన్ లో తీవ్రమైన వరదలు, ఖతార్ పై ఇజ్రాయిల్ దాడి మొదలైన అంశాలు చర్చకు వస్తాయని తెలుస్తోంది. భారత్ తో దౌత్యపరమైన ఉద్రిక్తతు కూడా ఈ సమావేశంలో పరిష్కరించబడుతాయని నివేదిక తెలిపింది.

అయితే, పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐసీసీ), వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయానికి దీనిపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. ఇప్పటికే ఆసిమ్ మునీర్ రెండు సార్లు అమెరికాలో పర్యటించారు. దీని తర్వాత, పాక్ ప్రధాని భేటీపై వార్తలు వచ్చాయి.

Read Also: Pakistan: జై షాకు భయపడ్డ పాకిస్తాన్.. ఐసీసీ ఆంక్షలు విధిస్తుందని పీసీబీ యూ-టర్న్.!

పెరుగుతున్న యూఎస్-పాక్ సంబంధాలు:

అమెరికాకు ప్రత్యర్థిగా పరిగణిస్తున్న చైనాతో ఇన్నాళ్లు అంటకాగిన పాకిస్తాన్, ఇప్పుడు అమెరికాతో సంబంధాల కోసం చూస్తోంది. ఏళ్ల తరబడి రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జూన్ నెలలో ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో వైట్‌హౌజ్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి, క్రిప్టో కరెన్సీ గురించి చర్చించడంతో పాక్-అమెరికా సంబంధాలు మళ్లీ బలపతున్నాయి. దీని తర్వాత, జూలైలో పాకిస్తాన్‌లో భారీగా ‘‘చమురు నిల్వలు’’ ఉన్నాయని, వాటిని డెవలప్ చేయడానికి సహకరిస్తామని అమెరికా చెప్పింది. ఇటీవల, ఖనిజ రంగంలో పాకిస్తాన్ అమెరికా నుంచి 500 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పొందగలిగింది.

Exit mobile version