Pakistan: జై షాకు భయపడ్డ పాకిస్తాన్.. ఐసీసీ ఆంక్షలు విధిస్తుందని పీసీబీ యూ-టర్న్.!
- భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ‘‘ షేక్ హ్యాండ్’’ వివాదం..
- ఆసియా కప్ నుంచి వైదొలిగే ఆలోచనే చేసిన పాక్ జట్టు..
- ఐసీసీ ఆంక్షలకు భయపడి చివరకు యూ-టర్న్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 మ్యాచులు జరుగుతున్నాయి. అయితే, ఈ టోర్నీకే హైలెట్గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ అత్యంత సునాయాసంగా దాయాదిని మట్టికరిపించింది. ఇదిలా ఉంటే, ఈ ఓటమి కన్నా, పాకిస్తాన్ జట్టును, ఆ దేశాన్ని మరో విషయం తెగ బాధ పెడుతోంది. భారత్ జట్టు ఆటగాళ్లు, పాకిస్తాన్ క్రికెటర్లను కనీసం పట్టించుకోలేదు, ‘‘షేక్ హ్యాండ్’’ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే తీవ్ర వివాదాస్పదంగా మారింది. పాక్ మాజీ క్రికెటర్లు, భారత్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అయితే, ఈ అవమానంతో పాకిస్తాన్ ఆసియా కప్ నుంచి వైదొలగుతామని బెదిరించినట్లు తెలుస్తోంది. చివరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ ఆలోచనపై యూ-టర్న్ తీసుకుంది. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది. అయితే, అందుకు ఐసీసీ ఒప్పుకోలేదు. భారత్తో జరిగిన మ్యాచ్లో హ్యాండ్షేక్ ఇవ్వకపోవడంలో రిఫరీ కీలకంగా వ్యవహరించారని పాకిస్తాన్ కీలక ఆరోపణ. ఆయనను తొలగించకుంటే యూఏఈతో జరగనున్న మ్యాచ్ను బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించింది. ఐసీసీ పాక్ బెదిరింపుల్ని కనీసం పట్టించుకోలేదు.
Also Read
- Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
- IND vs ENG 1st ODI: సీనియర్ల రీఎంట్రీతో ఆసక్తికర పోరు.. భారత తుది జట్టు ఇదే..
- India vs England: రోహిత్, కోహ్లీ ఉన్నంత మాత్రాన గెలవలేం.. టీమిండియాను వేధిస్తున్న ఈ 4 కీలక ప్రశ్నలు!
- CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
Read Also: Telangana : మా పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు ఆడొద్దు” గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రుల ఆవేదన
ఒక వేళ టోర్నీ నుంచి వైదొలిగితే ఐసీసీ తీసుకునే ఆంక్షలకు బలవుతామని భయపడిన పాకిస్తాన్ యూ-టర్న్ తీసుకుందని తెలుస్తోంది. ఆసియా కప్ నుంచి పాక్ జట్టు వైదొలగడం చాలా అరుదు అని పీసీబీ వర్గాలు తెలిపాయి. ఒక వేళ మేము అలా చేస్తే జై షా నేతృత్వంలోని ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుపై భారీ ఆంక్షలు విధించే అవకాశం ఉందని, ఇది మా బోర్డు భరించలేని విషయమని, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆర్థిక పరిస్థితి బాగా లేదని పీసీబీ వర్గాలు చెప్పాయి.
ఈ అవమానానికి కారణంగా చెబుతూ, పలువురు పాక్ క్రికెట్ అధికారులను పీసీసీ తొలగించేందుకు సిద్ధమైంది. పీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఉస్మాన్ వాల్హా టోర్నీ సమయంలో అనుసరించాల్సిన నియమాలు, నిబంధనల గురించి పాక్ కెప్టెన్కు తెలియజేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని కొన్ని మీడియాలు నివేదించాయి. ఈ కారణంగానే వాల్హాను తొలగించాలని పీసీబీ మొహ్సిన్ నఖ్వీ ఆదేశించారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
-
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
-
Shiv Charan Reddy: ‘నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు’.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
-
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!