China Covid Protest: ఏమిటీ ‘ఏ4 విప్లవం’.. తెల్లకాగితం గుర్తు వెనుక రహస్యమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secret Behind China People White Paper Protest: చైనాలో కరోనా కేసులు మళ్లీ విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో.. అక్కడి ప్రభుత్వం కఠినమైన కొవిడ్ ఆంక్షలు విధించింది. జీరో కొవిడ్ విధానాన్ని అవలంభిస్తోంది. దీని వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా చైనా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఇప్పుడు ఈ నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. తియానన్మెన్ స్క్వేర్ ఆందోళన తర్వాత చైనాలో ఇవే అతిపెద్ద నిరసనలంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే.. చైనా ప్రజలు తమ నిరసనలు తెలియజేసేందుకు తెల్లకాగితాలను గుర్తుగా ఎంపిక చేసుకున్నారు. దీంతో ఈ ఆందోళనలను ‘తెల్లకాగితం విప్లవం’ లేదా ‘ఏ4 విప్లవం’గా అభివర్ణిస్తున్నారు. చైనీయులు ఈ తెల్లకాగితాల్ని వినియోగించడం వెనుక ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది. సాధారణంగా చైనాలో ఎవరైనా ఆందోళనలు చేపడితే, దాన్ని మొగ్గదశలోనే అణచివేస్తారు. ఆందోళనకారుల పట్ల కఠినమైన చర్యలు సైతం తీసుకుంటారు. అలా అణచివేతకు గురవ్వకుండా ఉండేందుకే.. ఈ తెల్లకాగితం విప్లవం అనేది తెరమీదకి వచ్చింది. ప్రభుత్వాన్ని కానీ, వ్యక్తులను కానీ కించపర్చకుండా ఆందోళన చేపట్టడమే.. ఈ తెల్లకాగితం ఉద్యమం వెనుక ఆంతర్యం. దీంతోపాటు చైనాలోని సెన్సార్షిప్ను తెలియజేసేందుకు కూడా ఈ తెల్ల కాగితమే గుర్తుగా ఉంటుంది.
Also Read
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఈ తెల్ల కాగితంతో ఆందోళనలు చేపడితే.. ఏమీ తెలియజేయకుండానే, అసలు విషయం అందరికీ తెలుస్తుంది. ఈ నిరసనల్ని చైనాలో తీవ్రంగా పరిగణిస్తారు. చైనాలోని ప్రఖ్యాత సింగ్వా విశ్వవిద్యాలయంలో ఈ రకంగానే విద్యార్థులు నిరసన తెలిపారు. అలాగే.. 2020లో హాంకాంగ్ ఆందోళనల్లో కూడా నిరసనకారులు తెల్లకాగితాన్ని తమ గుర్తుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జీరో కొవిడ్ వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలోనూ తెల్లకాగితాల్ని నిరసనకారులు తమ గుర్తుగా ఎంపిక చేసుకోవడంతో.. అక్కడి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. అందుకే, ఈ ప్రదర్శనల్ని సోషల్ మీడియా నుంచి మాయం చేసేందుకు.. చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. టెక్ దిగ్గజాలైన టిక్టాక్, విబో వంటి వాటిని రంగంలోకి దింపి.. తెల్లకాగితం చిత్రాలను తొలగించే పనిలో పడింది.
ఇదిలావుండగా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే, చైనాలో మాత్రం మూడేళ్ల నుంచి పరిస్థితులు మారలేదు. అక్కడ జీరో కొవిడ్ విధానం కొనసాగుతూనే ఉంది. దీంతో.. గత నెలలో కొవిడ్ లాక్డౌన్లకు వ్యతిరేకంగా ఝాంఝూలో కార్మికులు పోలీసులపై తిరగబడ్డారు. రీసెంట్గా షింజియాంగ్లో ఉరుంకీ నగరంలో ఒక అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందడంతో.. అక్కడి ప్రజలు రోడ్డుమీదకొచ్చారు. ఇప్పుడు ఆందోళనలు కొవిడ్ లాక్డౌన్లను దాటి.. షీజిన్పింగ్ను తొలగించాలనే వరకూ చేరుకున్నాయి.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!