China Covid Protest: ఏమిటీ ‘ఏ4 విప్లవం’.. తెల్లకాగితం గుర్తు వెనుక రహస్యమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secret Behind China People White Paper Protest: చైనాలో కరోనా కేసులు మళ్లీ విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో.. అక్కడి ప్రభుత్వం కఠినమైన కొవిడ్ ఆంక్షలు విధించింది. జీరో కొవిడ్ విధానాన్ని అవలంభిస్తోంది. దీని వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా చైనా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఇప్పుడు ఈ నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. తియానన్మెన్ స్క్వేర్ ఆందోళన తర్వాత చైనాలో ఇవే అతిపెద్ద నిరసనలంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే.. చైనా ప్రజలు తమ నిరసనలు తెలియజేసేందుకు తెల్లకాగితాలను గుర్తుగా ఎంపిక చేసుకున్నారు. దీంతో ఈ ఆందోళనలను ‘తెల్లకాగితం విప్లవం’ లేదా ‘ఏ4 విప్లవం’గా అభివర్ణిస్తున్నారు. చైనీయులు ఈ తెల్లకాగితాల్ని వినియోగించడం వెనుక ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది. సాధారణంగా చైనాలో ఎవరైనా ఆందోళనలు చేపడితే, దాన్ని మొగ్గదశలోనే అణచివేస్తారు. ఆందోళనకారుల పట్ల కఠినమైన చర్యలు సైతం తీసుకుంటారు. అలా అణచివేతకు గురవ్వకుండా ఉండేందుకే.. ఈ తెల్లకాగితం విప్లవం అనేది తెరమీదకి వచ్చింది. ప్రభుత్వాన్ని కానీ, వ్యక్తులను కానీ కించపర్చకుండా ఆందోళన చేపట్టడమే.. ఈ తెల్లకాగితం ఉద్యమం వెనుక ఆంతర్యం. దీంతోపాటు చైనాలోని సెన్సార్షిప్ను తెలియజేసేందుకు కూడా ఈ తెల్ల కాగితమే గుర్తుగా ఉంటుంది.
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
ఈ తెల్ల కాగితంతో ఆందోళనలు చేపడితే.. ఏమీ తెలియజేయకుండానే, అసలు విషయం అందరికీ తెలుస్తుంది. ఈ నిరసనల్ని చైనాలో తీవ్రంగా పరిగణిస్తారు. చైనాలోని ప్రఖ్యాత సింగ్వా విశ్వవిద్యాలయంలో ఈ రకంగానే విద్యార్థులు నిరసన తెలిపారు. అలాగే.. 2020లో హాంకాంగ్ ఆందోళనల్లో కూడా నిరసనకారులు తెల్లకాగితాన్ని తమ గుర్తుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జీరో కొవిడ్ వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలోనూ తెల్లకాగితాల్ని నిరసనకారులు తమ గుర్తుగా ఎంపిక చేసుకోవడంతో.. అక్కడి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. అందుకే, ఈ ప్రదర్శనల్ని సోషల్ మీడియా నుంచి మాయం చేసేందుకు.. చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. టెక్ దిగ్గజాలైన టిక్టాక్, విబో వంటి వాటిని రంగంలోకి దింపి.. తెల్లకాగితం చిత్రాలను తొలగించే పనిలో పడింది.
ఇదిలావుండగా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే, చైనాలో మాత్రం మూడేళ్ల నుంచి పరిస్థితులు మారలేదు. అక్కడ జీరో కొవిడ్ విధానం కొనసాగుతూనే ఉంది. దీంతో.. గత నెలలో కొవిడ్ లాక్డౌన్లకు వ్యతిరేకంగా ఝాంఝూలో కార్మికులు పోలీసులపై తిరగబడ్డారు. రీసెంట్గా షింజియాంగ్లో ఉరుంకీ నగరంలో ఒక అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందడంతో.. అక్కడి ప్రజలు రోడ్డుమీదకొచ్చారు. ఇప్పుడు ఆందోళనలు కొవిడ్ లాక్డౌన్లను దాటి.. షీజిన్పింగ్ను తొలగించాలనే వరకూ చేరుకున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?