China Covid Protest: ఏమిటీ ‘ఏ4 విప్లవం’.. తెల్లకాగితం గుర్తు వెనుక రహస్యమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secret Behind China People White Paper Protest: చైనాలో కరోనా కేసులు మళ్లీ విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో.. అక్కడి ప్రభుత్వం కఠినమైన కొవిడ్ ఆంక్షలు విధించింది. జీరో కొవిడ్ విధానాన్ని అవలంభిస్తోంది. దీని వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా చైనా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఇప్పుడు ఈ నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. తియానన్మెన్ స్క్వేర్ ఆందోళన తర్వాత చైనాలో ఇవే అతిపెద్ద నిరసనలంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే.. చైనా ప్రజలు తమ నిరసనలు తెలియజేసేందుకు తెల్లకాగితాలను గుర్తుగా ఎంపిక చేసుకున్నారు. దీంతో ఈ ఆందోళనలను ‘తెల్లకాగితం విప్లవం’ లేదా ‘ఏ4 విప్లవం’గా అభివర్ణిస్తున్నారు. చైనీయులు ఈ తెల్లకాగితాల్ని వినియోగించడం వెనుక ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది. సాధారణంగా చైనాలో ఎవరైనా ఆందోళనలు చేపడితే, దాన్ని మొగ్గదశలోనే అణచివేస్తారు. ఆందోళనకారుల పట్ల కఠినమైన చర్యలు సైతం తీసుకుంటారు. అలా అణచివేతకు గురవ్వకుండా ఉండేందుకే.. ఈ తెల్లకాగితం విప్లవం అనేది తెరమీదకి వచ్చింది. ప్రభుత్వాన్ని కానీ, వ్యక్తులను కానీ కించపర్చకుండా ఆందోళన చేపట్టడమే.. ఈ తెల్లకాగితం ఉద్యమం వెనుక ఆంతర్యం. దీంతోపాటు చైనాలోని సెన్సార్షిప్ను తెలియజేసేందుకు కూడా ఈ తెల్ల కాగితమే గుర్తుగా ఉంటుంది.
Also Read
- Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
- Jaishankar: యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియోకి జైశంకర్ ఫోన్.. అమెరికాకు భారత్ బిగ్ వార్నింగ్..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
ఈ తెల్ల కాగితంతో ఆందోళనలు చేపడితే.. ఏమీ తెలియజేయకుండానే, అసలు విషయం అందరికీ తెలుస్తుంది. ఈ నిరసనల్ని చైనాలో తీవ్రంగా పరిగణిస్తారు. చైనాలోని ప్రఖ్యాత సింగ్వా విశ్వవిద్యాలయంలో ఈ రకంగానే విద్యార్థులు నిరసన తెలిపారు. అలాగే.. 2020లో హాంకాంగ్ ఆందోళనల్లో కూడా నిరసనకారులు తెల్లకాగితాన్ని తమ గుర్తుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జీరో కొవిడ్ వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలోనూ తెల్లకాగితాల్ని నిరసనకారులు తమ గుర్తుగా ఎంపిక చేసుకోవడంతో.. అక్కడి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. అందుకే, ఈ ప్రదర్శనల్ని సోషల్ మీడియా నుంచి మాయం చేసేందుకు.. చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. టెక్ దిగ్గజాలైన టిక్టాక్, విబో వంటి వాటిని రంగంలోకి దింపి.. తెల్లకాగితం చిత్రాలను తొలగించే పనిలో పడింది.
ఇదిలావుండగా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే, చైనాలో మాత్రం మూడేళ్ల నుంచి పరిస్థితులు మారలేదు. అక్కడ జీరో కొవిడ్ విధానం కొనసాగుతూనే ఉంది. దీంతో.. గత నెలలో కొవిడ్ లాక్డౌన్లకు వ్యతిరేకంగా ఝాంఝూలో కార్మికులు పోలీసులపై తిరగబడ్డారు. రీసెంట్గా షింజియాంగ్లో ఉరుంకీ నగరంలో ఒక అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందడంతో.. అక్కడి ప్రజలు రోడ్డుమీదకొచ్చారు. ఇప్పుడు ఆందోళనలు కొవిడ్ లాక్డౌన్లను దాటి.. షీజిన్పింగ్ను తొలగించాలనే వరకూ చేరుకున్నాయి.
తాజావార్తలు
-
Sing Geetham: సింగ్ గీతాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
-
Ridge Gourd Peel Besan Curry Recipe: బీరకాయ తొక్కలను పారేయకండి.. ఈ సూపర్ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదలరు…
ట్రెండింగ్
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..