Zombie Virus: 48,500 ఏళ్ల నాటి జాంబీ వైరస్ వెలుగులోకి.. మరో 12 కొత్త వైరస్లు కూడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Scientists Revived 48500 Year Old Zombie Virus In Russia: ఇప్పటికే వాతావరణ మార్పులు, మానవ తప్పిదాల కారణంగా.. ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఓవైపు గ్లోబల్ వార్మింగ్, మరోవైపు ప్రయోగాల పేరుతో వైరస్లు వ్యాపిస్తుండటం, ఘనీభవించిన మంచు కరిగిపోతుండటంతో.. మానవాళికి ముప్పు వాటిల్లుతోంది. ఇది చాలదన్నట్టు.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఒక వైరస్ వెలుగులోకి వచ్చింది. ఒక మంచు ప్రాంతంలో శాస్త్రవేత్తలు 48,500 ఏళ్ల నాటి ‘జాంబీ వైరస్’ను గుర్తించారు. అదొక్కటే కాదండోయ్.. మరో రెండు డజన్ల కొత్త వైరస్లను కూడా వెలికితీశారు. సాధారణంగా మంచు ప్రాంతాల్లో ఎన్నో రకాల డేంజరస్ వైరస్లు ఉంటాయి. మానవాళికి వాటి వల్ల ఏమైనా ముప్పు ఉందా? అనే విషయంపై శాస్త్రవేత్తలు ఎప్పుడూ పరిశోధనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజా పరిశోధనలో ఈ జాంబీ వైరస్ బయటపడింది.
రష్యాలోని సైబీరియా ప్రాంతం ఎక్కువగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడి మంచు పొరల కింద లభ్యమైన నమూనాల్ని యూరప్ పరిశోధకులు పరీక్షించగా.. వాటిలో 13 రకాల హానికారకమైన సూక్ష్మజీవ జాతులను గుర్తించారు. తమ పరిశోధనల్లో ఇవి అత్యంత ప్రమాదకరమైన వైరస్లుగా తేలడంతో, శాస్త్రవేత్తలు వాటిని జాంబీ వైరస్లుగా భావిస్తున్నారు. వేల సంవత్సరాల నుంచి అవి నిద్రాణ స్థితిలో ఉన్నాయని.. అయినప్పటికీ అవి వ్యాధిక కారక శక్తిని ఏమాత్రం కోల్పోలేదని వాళ్లు తేల్చారు. అంటే.. ఇవి ఇప్పటికీ ప్రభావం చూపుతాయన్నమాట! ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో మంచు ఖండాలు వేగంగా కరుగుతున్నాయని, తద్వారా గతంలో చిక్కుబడిపోయిన ‘మీథేన్’ వంటి గ్రీన్ హౌస్ వాయువులు విడుదల అవుతున్నాయని, అవి వాతావరణ మార్పులపై చాలా ప్రభావితం చూపుతాయని శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో చెప్తూనే ఉన్నారు. అయితే.. ప్రభావం నిద్రాణ స్థితిలో ఉన్న వైరస్లపై వాటి ప్రభావం ఉంటుందా? లేదా? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.
Also Read
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
తాజా పరిశోధనలో రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఒకవేళ ఈ జాంబీ వైరస్లు బయటి వాతావరణంలోకి విడుదలైతే.. జంతువులకు, మానవాళికి పెను సమస్యగా పరిణమిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి బాహ్య వాతావరణంలోకి ప్రవేశిస్తే.. ఎంతకాలం వరకు ప్రభావం చూపుతాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఇవి సోకడానికి వాహకాలేంటో అంచనా వేయడం అసాధ్యంగా ఉందని వాళ్లు పేర్కొంటున్నారు. ఇవి ఎలాంటి ముప్పును కలిగిస్తాయో, ఇప్పుడే ఏ నిర్ణయానికి రాలేమని చెప్తున్నారు. కానీ, బయటకొస్తే మాత్రం ముప్పు తప్పకుండా ఉండొచ్చని అంటున్నారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!