Ukraine War: “చెర్నోబిల్” వద్ద రేడియేషన్ బారిన పడిన రష్యా సైనికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాది పూర్తై ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తూర్పున ఉన్న నాలుగు కీలక ప్రాంతాలను తనలో కలిపేసుకుంది. జపొరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చెర్నోబిల్ అణు కర్మాగారం వద్ద కందకాలు తవ్విన రష్యా సైనికులు రేడియషన్ బారినపడి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ 1986లో పేలిపోయింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం నిషిద్ధ ప్రాంతంగా మారింది.
చెర్నోబిల్ విపత్తు తరువాత, రసాయన నిపుణుల బృందాలు కలుషితమైన మట్టిని త్రవ్వి అక్కడి రెడ్ ఫారెస్ట్లో భూమి క్రింద పాతిపెట్టడానికి పెట్టారు. రెేడియేషన్ అక్కడి పరిసరాల్లోకి వ్యాపించడంతో అటువైపుగా జనాలు వెళ్లకుండా 37 ఏళ్లకుపైగా నిషేధం కొనసాగుతోంది. అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతంలోకి రష్యా సైన్యం చొచ్చుకు వెల్లింది. దాదాపుగా 5 వారాల పాటు చెర్నోబిల్ ఏరియాలోనే రష్యా సైనికులు ఉన్నారు. దీంతో వారు రేడియేషన్ బారిన పడినట్లు తెలుస్తోంది.
Also Read
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
- Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
Read Also: Go First: గో ఫస్ట్ ఎయిర్లైన్స్ దివాళా.. 3 రోజలు పాటు ఫ్లైట్స్ బంద్..
అత్యంత విధ్వంసకమైన అణు ప్రమాదం..
1986 ఏప్రిల్ 26న అప్పటి సోవియట్ యూనియన్ లో ఉన్న చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. అర్థరాత్రి దాటిన తర్వాత 1.23 గంటలకు విద్యుత్ కేంద్రం భద్రతను పర్యవేక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విఫలం కావడంతో ఈ పేలుడు సంభవించింది. అణురియాక్టర్ లోని నాలుగో నంబర్ యూనిట్ లో విద్యుత్ సరఫరా ఆపేశారు. ఈ పనిచేయడానికి ముందే రియాక్టర్ సరిగ్గా పనిచేయడం లేదని ఇంజనీర్లు గుర్తించలేదు.
కరెంట్ నిలిచిపోవడంతో రియాక్టర్ కు నీటిని సఫ్లై చేసే టర్బైన్స్ ఆగిపోయాయి. ఫలితంగా రియాక్టర్లలో పీడన పెరిగి ఒక్కసారిగా పేలిపోయింది. అప్పటికే రియాక్టర్ ని నిలిపేద్దాం అనుకున్నప్పటికీ ఆలస్యం జరిగిపోయింది. ఈ దుర్ఘటన కారణంగా చెర్నోబిల్ ప్రాంతం నుంచి 2.34 లక్షల మంది ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లారు. రేడియేషన్ వల్ల 47 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!