Iran: టెల్ అవీవ్ని నాశనం చేస్తామన్న ఇరాన్.. సిద్ధంగా ఉన్నామన్న ఇజ్రాయిల్..
- మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు..
- టెల్ అవీవ్ని నాశనం చేస్తామని ఇరాన్ వార్నింగ్..
- సిద్ధంగా ఉన్నామన్న ఇజ్రాయిల్..
- ఇరు దేశాల మధ్య మళ్లీ టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఎప్పుడైతే హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై దాడులు చేసిందో అప్పటి నుంచి మధ్యప్రాచ్యంలో నిత్యం రణరంగంగా మారింది. ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా ఇరాన్, హమాస్, హిజ్బుల్లా కలిసి పనిచేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఇరాన్ ఇజ్రాయిల్కి భారీ హెచ్చరికలు చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3లో భాగంగా ఇజ్రాయిల్ని నాశనం చేస్తామని ఇరాన్కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) జనరల్ ఇబ్రహీం జబ్బారి నుండి తాజా హెచ్చరికలు వచ్చాయి.
‘‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 సరైన సమయంలో, ఖచ్చితత్వంతో ఇజ్రాయిల్ని నాశనం చేయడానికి, టెల్ అవీవ్-హైఫాలను నేలమట్టం చేయడానికి నిర్వహిస్తాము’’ అని మేజర్ జనరల్ జబ్బారి హెచ్చరించారు. ఈ బెదిరింపులకు ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి గిడియర్ సార్ స్పందించారు. ‘‘ యూదు ప్రజలు చరిత్ర నుంచి ఏదైనా నేర్చుకున్నారంటే అది ఇదే. మీ శత్రువు మిమ్మల్ని నానశం చేస్తామని చెబితే నమ్మంది- మేము అందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని అన్నారు.
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
జబ్బారికి ముందు ఇజ్రాయిల్ని మరో ఇద్దరు ఇరాన్ అధికారులు ఇదే విధంగా బెదిరించారు. IRGC డిప్యూటీ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీ ఫడవి, IRGC యొక్క ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అమీర్ అలీ హజీజాదే కూడా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3లో భాగంగా ఇజ్రాయెల్ను నాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఇదిలా ఉంటే, ఇటీవల కాలంలో ఇరాన్ తన క్షిపణి ఉత్పత్తిని పెంచినట్లు తెలుస్తోంది. దీని కోసం ఇరాన్ చైనా నుంచి 1000 టన్నుల రాకెట్ ఫ్యూయల్ని తెప్పించుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్ భూగర్భంలో సరికొత్త మిస్సైల్ సిటీని ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఇజ్రాయిల్-అమెరికా కలిసి ఇరాన్లోని అణు కేంద్రాలపై సంయుక్త దాడికి ఇదే సరైన సమయమని పలువురు అమెరికన్-ఇజ్రాయిల్ నిపుణులు వాదిస్తున్నారు. బహుళ అణు బాంబుల్ని రూపొందించేందుకు తగినంత ఆయుధ గ్రేడ్ యురేనియంని ఇరాన్ ఉత్పత్తి చేసే దశలో ఉందని అమెరికన్-ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ (AIPAC)లో మాజీ పరిశోధన అధిపతి కాలిన్ విన్స్టన్ అన్నారు.
తాజావార్తలు
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..