Putin: ఇరాన్కు విశ్వసనీయ మిత్రులం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సందేశం
- ఇరాన్కు విశ్వసనీయ మిత్రులం
- నమ్మకమైన భాగస్వామిగా ఉంటాం
- రష్యా అధ్యక్షుడు పుతిన్ సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్కు రష్యా విశ్వసనీయ మిత్రుడు అని అధ్యక్షుడు పుతిన్ సందేశం ఇచ్చారు. నౌరుజ్ (Nowruz) పెర్షియన్ నూతన సంవత్సరం పండుగ సందర్భంగా ఇరాన్ నాయకులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. మాస్కో-టెహ్రాన్ మంచి మిత్రులు అని..నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని శనివారం పుతిన్ కీలక సందేశం పంపించారు.
ఇది కూడా చదవండి: Iran-US: బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్.. షాకైన అమెరికా!
Also Read
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
దేశ సర్వోన్నత నాయకుడు అయతుల్లా మోజ్తాబా ఖమేనీకి, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్కు పుతిన్ శుభాకాంక్షలు పంపారని క్రెమ్లిన్ తెలిపింది. ‘‘ఇరాన్ ప్రజలు కఠినమైన పరీక్షలను గౌరవప్రదంగా అధిగమించాలని పుతిన్ ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో మాస్కో టెహ్రాన్కు నమ్మకమైన మిత్రుడుగా, విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుంది.’’ అని క్రెమ్లిన్ తెలిపింది.
ఇక రష్యాకు సంబంధించిన నిఘా సమాచారాన్ని వాషింగ్టన్ ఉక్రెయిన్కు అందించడం మానేస్తే.. ఇరాన్తో నిఘా సమాచారాన్ని పంచుకోవడం క్రెమ్లిన్ ఆపేస్తుందని మాస్కో వాషింగ్టన్కు ఒక ప్రతిపాదన చేసిందని.. అయితే అమెరికా ఆ ఆలోచనను తిరస్కరించిందని పొలిటికో నివేదించింది. క్రెమ్లిన్ మాత్రంఈ నివేదికను నకిలీదిగా కొట్టిపారేసింది.
వెనిజులా నాయకుడు నికోలస్ మదురోను అమెరికా కూలదోయడంతో రష్యా ఒక మిత్రదేశాన్ని కోల్పోయింది. ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల పెరిగిన చమురు ధరల నుంచి మాస్కో మాత్రం ప్రయోజనం పొందింది. అయితే ఇరాన్ అణు బాంబును అభివృద్ధి చేయడాన్ని తాము కోరుకోవడం లేదని రష్యా పదేపదే చెబుతోంది. అయితే ఈ చర్య మధ్యప్రాచ్యం అంతటా అణ్వాయుధ పోటీకి దారితీస్తుందని మాస్కో భయపడుతోంది.
ఇది కూడా చదవండి: Madhumita: ప్రముఖ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత
గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. దీంతో ప్రతీకారంగా ఇరాన్.. గల్ఫ్ దేశాలపై దాడి చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు సంక్షోభం తలెత్తింది.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో కొత్త రకం దొంగతనాలు.. షాకైన ప్రజలు
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!