Bangladesh: “ఉర్దూ, జిన్నా” వైపు బంగ్లాదేశ్ అడుగులు.. స్వాతంత్య్ర లక్ష్యాలని మరిచిపోతున్నారు..
- బెంగాలీ నుంచి ఉర్దూ వైపుకు బంగ్లాదేశ్..
- మహ్మద్ అలీ జిన్నాని పొగుడుతూ కార్యక్రమం..
- జిన్నా లేకుంటే బంగ్లాదేశ్ లేదంటూ వ్యాఖ్యలు..
- తన ఉనికిని కోల్పోతున్న బంగ్లా..
- పాకిస్తాన్ గతే బంగ్లాకు పట్టబోతోందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: ఒకప్పుడు దాయాది దేశం పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న బంగ్లాదేశ్(అప్పటి తూర్పు పాకిస్తాన్) ఏ లక్ష్యం కోసం స్వాతంత్య్రాన్ని తెచ్చుకుందో ఇప్పుడు ఆ లక్ష్యం మరుగునపడిపోతోంది. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మహ్మద్ అలీ జిన్నా, బెంగాలీ మాట్లాడే ప్రజలపై ఉర్దూ భాషను రద్దాలని చూడటమే బంగ్లాదేశ్ ఏర్పాటుకు మూలమైంది. అయితే, ఇప్పుడు షేక్ హసీనా దిగిపోయిన తర్వాత అక్కడ రాడికల్ ఇస్లామిస్టుల రాజ్యం నడుస్తోంది. జమాతే ఇస్లామీ వంటి మతఛాందస వాద సంస్థలకు కొత్త ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు పలువురు ఉగ్రవాద నేతల్ని జైలు నుంచి విడుదల చేయడం ఆందోళన కలిగిస్తోంది.
అయితే, తన ప్రత్యేకతను మరిచిన బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్గా మారేందుకు వడివడిగా పరుగులు తీస్తోంది. మహ్మద్ అలీ జిన్నాను విలన్గా చూసే రోజుల నుంచి అతడి వర్ధంతిని ఘనంగా జరుపుకునే స్థాయికి బంగ్లాదేశ్ చేరుకుంది. అనేక మంది బెంగాలీల ఊచకోతకు కారణమైన వ్యక్తిని పొగుడుతూ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ మద్దతు కలిగిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీ వంటి సంస్థలు విద్యార్థి ఉద్యమాన్ని హైజాక్ చేసి, ఇప్పుడు లౌకిక దేశంగా ఉన్న బంగ్లాని, ఇస్లామిక్ దేశంగా మార్చాలని భావిస్తున్నాయి.
Also Read
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
- India - Pakistan: భారత్ - పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
- Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
ఇటీవల జిన్నా 76వ వర్ధంతి సందర్భంగా ఢాకాలో ఉర్దూ కవిత్వం, పాటలతో ఓ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. బంగ్లాదేశ్ చరిత్రలో జిన్నా వర్ధంతిని ఢాకాలో నిర్వహించడం ఇదే తొలిసారి. జిన్నా లేకుంటే బంగ్లాదేశ్ ఉనికే లేదని ఈ కార్యక్రమానికి హాజరైన వారు తెగ పొగిడారు. బెంగాలీని కాదని ఉర్దూని ప్రేమించడం, జిన్నాని అభిమానించడం అక్కడి పాక్ మద్దతుదారులకు, ఇస్లామిక్ శక్తులకు సంతోషం కలిగిస్తుంటే, స్వాతంత్య్రం కోసం ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలు మాత్రం 1971 నాటి నెత్తుటి జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నాయి.
ఢాకా ప్రెస్ క్లబ్లో ఘనంగా జిన్నా వర్ధంతి వేడుకలు:
షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో జిన్నా అనే పేరు కానీ, ఉర్దూ అనే పేరు కానీ వినబడేది కాదు. మైనారిటీలపై దాడులు జరిగేవి కాదు. కానీ ఇప్పుడు అక్కడ అంతా రివర్స్ అయింది. ఢాకా ప్రెస్ క్లబ్లో ఘనంగా జిన్నా వర్ధంతి వేడకలు నిర్వహించారు. తోఫజల్ హుస్సేన్ మానిక్ మియా హాల్లో నవాబ్ సలీముల్లా అకాడెమీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు జిన్నా లేకుంటే “బంగ్లాదేశ్ కూడా ఉనికిలో ఉండదు” అని పేర్కొంటూ పాకిస్తాన్ ఏర్పాటులో జిన్నా యొక్క కీలక పాత్రను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ హైకమిషనర్ హాజరుకావల్సి ఉన్నా, అతను గైర్హాజరు కావడంతో అతడికి బదులుగా డిప్యూటీ హైకమీషనర్ కమ్రాన్ ధంగల్ పాకిస్తాన్కి ప్రాతినిధ్యం వహించారు.
1952లో తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్)పై ఉర్దూని బలవంతంగా రుద్దారు. ప్రభుత్వం, విద్య, మీడియా, కరెన్సీ, స్టాంపులపై ఉర్దూని బలవంతం చేయడం ప్రారంభించారు. దీంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. బెంగాలీ భాష కోసం పోరాటం మొదలైంది. ఈ ఉద్యమంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఎండీ సంసుద్దీన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ లేకుండా బంగ్లాదేశ్ ఉండేది కాదని అన్నారు. బంగ్లాదేశ్ కూడా కాశ్మీర్ లాగా తయారయ్యేదని, భారత్ మన మెడపై ఆయుధాలను ఉంచేదని వివాదాస్పద ప్రకటన చేశాడు. బంగ్లాదేశ్కి అంతిమంగా స్వాతంత్య్రం రావడంతో పాకిస్తాన్ ఏర్పాటుకు కారణమైన జిన్నా కృషిని ప్రశంసించాడు.
ఢాకా యూనివర్సిటలో ‘‘అల్లామా ఇక్బాల్ హాల్ లేదా జిన్నా ఎవెన్యూ’’ వంటి పేర్లను తొలగించడంలో బంగ్లాదేశ్ ప్రమేయం లేదని, ఇది న్యూఢిల్లీ ఆసక్తి అని ఆరోపించాడు. మరో వక్త నజ్రుల్ ఇస్లాం కూడా ఇదే వైఖరిని సమర్ధించాడు. జిన్నా మన జాతి పితామహుడు, కానీ మనం దానిని గుర్తించలేదు, పాకిస్తాన్తో మన సోదరభావాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చాడు.
అయితే, ఈ కార్యక్రమాన్ని జాతీయవాద బంగ్లాదేశీలు విమర్శిస్తున్నారు. జర్నలిస్ట్ సలాఉద్దీన్ షోయబ్ చౌదరి స్పందిస్తూ.. 30 లక్షల మంది బెంగాలీలు తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్య్రానికి ఇది చెప్పదెబ్బగా అభివర్ణించారు. బంగ్లాదేశ్ తన చరిత్రను తిరగ రాస్తోందా.. అని ఇస్లామాబాద్కి చెందిన విశ్లేషకుడు అష్ఫాక్ హసన్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Shahrukh Khan: చరిత్ర సృష్టించిన ‘షారుఖ్’ నైట్ రైడర్స్.. సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు!
-
IBPS PO Recruitment 2026: బ్యాంకింగ్ కెరీర్కు గోల్డెన్ ఛాన్స్.. వేల సంఖ్యలో PO పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..
-
Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?