Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi-Meloni: ఇటలీ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది.. మోడీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రత్యేకంగా స్వాగతం పలికారు. మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో మోడీతో కలిసి దిగిన ఓ కొత్త సెల్ఫీని పంచుకుంటూ “రోమ్కు స్వాగతం, నా మిత్రమా!” అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోగా.. ఆ తర్వాత మెలోనితో కలిసి దిగన నాలుగు ఫొటోలను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.. “రోమ్కు చేరుకున్న అనంతరం ప్రధాని మెలోనితో డిన్నర్ సందర్భంగా సమావేశమయ్యే అవకాశం లభించింది. అనంతరం చారిత్రాత్మక కొలస్సియంను సందర్శించాం. పలు కీలక అంశాలపై పరస్పర అభిప్రాయాలను పంచుకున్నాం. భారత్-ఇటలీ స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై నేటి చర్చల కోసం ఎదురుచూస్తున్నాను.” అంటూ తన ఎక్స్ ఖాతా (ట్విట్టర్)లో రాసుకొచ్చారు ప్రధాని మోడీ..
ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోమ్ చేరుకున్న అనంతరం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాత్రి విందు సందర్భంగా ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం అయిన Colosseumను కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “రోమ్ చేరుకున్న తర్వాత ప్రధాని మెలోనితో డిన్నర్ సమావేశం జరిగింది. అనంతరం చారిత్రక కొలస్సియంను సందర్శించే అవకాశం లభించింది. పలు అంశాలపై పరస్పర అభిప్రాయాలను పంచుకున్నాం. భారత్-ఇటలీ స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై నేటి చర్చల కోసం ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నారు.
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
అయితే, మోడీ-మెలోని భేటీ ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. వాణిజ్యం, రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, సాంకేతిక సహకారం వంటి పలు కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇటలీ ప్రధాని మెలోని ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటన భారత్-ఇటలీ సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇద్దరు నాయకుల మధ్య సన్నిహిత సంబంధాలు పెరుగుతుండగా, ఈ పర్యటన ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. రోమ్లో మోడీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే బహుమతులు అందిస్తూ ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించారు. ప్రస్తుతం మోడీ ఇటలీ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the… pic.twitter.com/df0bDYKCdU
— Narendra Modi (@narendramodi) May 20, 2026
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!