Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Modi Meeting Chief Ministers West Asia Crisis No Lockdown India

PM Modi: సీఎంలతో ముగిసిన మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!

Published Date :March 27, 2026 , 9:47 pm
By Suresh Maddala
  • సీఎంలతో ముగిసిన మోడీ భేటీ
  • భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం
  • కోవిడ్ సంక్షోభాన్ని జయించినట్లుగా ఎదుర్కొందామని పిలుపు
PM Modi: సీఎంలతో ముగిసిన మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన ప్రధాని మోడీ సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎదురయ్యే సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై మోడీ దిశా నిర్దేశం చేశారు. ఇక ఈ సమావేశంలో ఎక్కడా కూడా లాక్‌డౌన్ అంశాన్ని ప్రస్తావించలేదని సమాచారం. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని తేలిపోయింది. గత కొద్దిరోజులుగా ప్రజల్లో లాక్‌డౌన్ భయాందోళనలు రేకెత్తించారు. నేటి ప్రధాని మోడీ సమావేశంతో ఆ వార్తలు నిజం కాదని తేలిపోయింది. ఈ భేటీకి ముందు కూడా కేంద్రం కూడా లాక్‌డౌన్ వార్తలను కొట్టిపారేసింది.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో అనుసరించిన సహకార సమాఖ్య వ్యూహాన్ని మోడీ గుర్తుచేశారు. ‘‘టీమిండియా’’ విధానాన్ని నొక్కి చెప్పారు. ఇంధనం, ఎరువులు, భద్రతపై ప్రభావం చూపే దీర్ఘకాలిక ప్రపంచ అంతరాయాల గురించి హెచ్చరిస్తూనే.. కష్టాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలిసి కట్టుగా సంక్షోభాన్ని జయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో సమన్వయం ఉండేలా చూడటమే దీని లక్ష్యం. ఇక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కాలేదు.

Also Read

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్‌లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
  • Project Freedom: అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
Add as a preferred
source on google

ఇక పశ్చిమాసియా సంఘర్షణ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కేంద్రం మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసింది. సవాళ్లను పరిష్కరించేందుకు రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఒక అంతర్-మంత్రివర్గ బృందాన్ని (ఐజీఎం) ఏర్పాటు చేసింది. ఇందులో అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరి కీలక సభ్యులుగా ఉన్నారు.

ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఛత్తీస్‌గఢ్‌ విష్ణు దేవ్‌సాయి, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, జమ్మూ కాశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, పంజాబ్‌ భగవంత్‌ మాన్‌, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు.

ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం జరగనుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కోసం కేబినెట్ సెక్రటేరియట్ ద్వారా ప్రత్యేక సమావేశం జరగనుంది.

ఇది కూడా చదవండి: Srinagar: శ్రీనగర్-లేహ్ రహదారిపై భారీ హిమపాతం.. ఏడుగురు మృతి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah Nirmala Sitharaman meeting
  • fuel supply India strategy
  • India crisis management 2026
  • Modi Team India approach
  • no lockdown India news

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions