Putin: “పీఎం మోడీ ఈస్ రైట్”.. రష్యా అధినేత ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: భారత మిత్రదేశం రస్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. ‘‘పీఎం మోడీ ఈస్ రైట్’’ అంటూ ఓ సదస్సులో ప్రశంసించారు. రష్యా వ్లాడివోస్టాక్ నగరంలో 8వ ‘ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్’ సదస్సులో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం గురించి పుతిన్ మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియాను ప్రధాని మోడీ ప్రోత్సహిస్తూ సరైన పనిచేస్తున్నారని అన్నారు. కార్ల తయారీపై మీడియా అడిగిన ప్రశ్నకు పుతిన్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. దేశీయంగా తయారైన ఆటోమొబైల్స్ ని వినియోగించాలని, ప్రధాని మోడీ నాయకత్వంలోని భారత్ ఇప్పటికే ఈ విధానాన్ని చేపడుతోందని అన్నారు.
Read Also: NEET: కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 25వ కేసు..
Also Read
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
ప్రస్తుతం రష్యాకు దేశీయంగా తయారుచేసిన కార్లు లేవు, కానీ ఇప్పుడు మేం చేస్తున్నామని, రష్యా ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మెర్సిడెస్, ఆడి కార్లతో పోలిస్తే ఇవి నిరాడంబరంగా 1990లా ఉంటాయని వ్యాఖ్యానించారు. భారతదేశం, ఆ దేశంలో నిర్మించిన కార్ల వినియోగంపై దృష్టి సారించిందని పుతిన్ కొనియాడారు. ఇదే విధంగా రష్యాలో తయారైన ఆటోమొబైల్స్ ని వినియోగించడం మంచిదని అన్నారు. తాజాగా జీ20 సమావేశంలో యూఎస్ఏ, సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయిల్, యూరప్, ఇండియా దేశాలు కలిసి ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్’ ఎకనామిక్ కారిడార్(IMEC)ని ప్రారంభించాయని, ఇది రష్యాకు ఆటంకం కలిగించేది కాదని, రష్యాకు దీనితో ప్రయోజనం ఉంటుందని పుతిన్ అన్నారు.
ఈ ఎకనామిక్ కారిడార్ ముందుగా యూరోపియన్ యూనియన్, సౌదీ అరేబియా, భారత్ అంగీకరించిన తర్వాత చివరకు అమెరికా కూడా వచ్చి చేరిందని పుతిన్ వెల్లడించారు. రష్యా దేశానికి లాజిస్టిక్స్ను అభివృద్ధి చేయడంలో IMEC సహాయం చేస్తుందని రష్యా అధ్యక్షుడు చెప్పారు. ఈ ప్రాజెక్టు చాలా ఏళ్లుగా చర్చల్లో ఉందని తెలిపారు. జీ20 వేదికగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్పై వివిధ దేశాలు ఒప్పందాన్ని ప్రకటించాయి. ఈ ప్రాజెక్టులో మెగా రైల్వే, షిప్పింగ్ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. దీని వల్ల భారత్తో అరబ్, గల్ఫ్, యూరప్ దేశాలు అనుసంధానం కానున్నాయి.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!