Sheikh Hasina: ‘‘నిప్పుతో చెలగాటం’’.. యూనస్కి హసీనా వార్నింగ్..
- నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు, నిన్ను కాల్చేస్తుంది..
- మహ్మద్ యూనస్కు షేక్ హసీనా వార్నింగ్..
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, తాత్కాలిక దేశాధినేత మహ్మద్ యూనస్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయనను విదేశాలతో కలిసి దేశ పతనానికి కుట్ర పన్నిన “స్వార్థపరుడైన రుణగ్రహీత”గా అభివర్ణించారు. విద్యార్థి నిరసనకారుడు అబూ సయీద్ను చంపిన దానిపై కూడా ఆమె సందేహాలను లేవనెత్తారు. 8 నిమిషాల వర్చువల్ ప్రసంగంలో ఆమె యూనస్పై ధ్వజమెత్తారు. ఆదివారం ఆమె తన మద్దతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడారు. బంగ్లాదేశ్ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమం అవామీ లీగ్తో ముడిపడి ఉందని, యూనస్ వీటిని తుడిపెట్టాలని అనుకుంటున్నాడని ఆమె ఆరోపించారు.
స్వాతంత్ర్య ఉద్యమకారుల జ్ఞాపకార్థం అన్ని జిల్లాల్లో తమ ప్రభుత్వం నిర్మించిన ముక్తి జోద్ధా కాంప్లెక్సులను తగలబెడుతున్నారని, మీరు నిప్పుతో చెలగాటం ఆడుకుంటే, అది మిమ్మల్ని కాల్చేస్తుందని ఆమె హెచ్చరించారు. బంగ్లాదేశ్ని నాశనం చేయాలనుకుంటున్న విదేశీ కుట్రదారులతో యూనస్ కలిపిపోయాడని ఆమె ఆరోపించారు. దేశాన్ని నాశనం చేయడానికి విదేశీ నిధుల్ని ఉపయోగిస్తున్నాడని, BNP (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) మరియు జమాత్-ఇ-ఇస్లామిలు అవామీ లీగ్ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తూ, హత్యలకు తెగబడుతున్నారని అన్నారు.
Also Read
- Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
- Trump: హార్ముజ్పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
Read Also: Mancherial: మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు..
తమ పాలన ముగియడం బంగ్లాదేశ్ పరిశ్రమలకు షాక్ని ఇచ్చిందని, వేలాది కర్మాగారాలు మూతపడ్డాయని, అవామీ లీగ్తో సంబంధం ఉన్న కర్మాగారాలు కాలిపోయాయని, హోటళ్లు, ఆస్పత్రులు ప్రతీదాన్ని నాశనం చేస్తున్నారని యూనస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘ చట్ట అమలు చేసే సిబ్బందిని బహిరంగంగా హత్య చేస్తే ఈ దేశం ఎలా నడుస్తుంది? యూనస్కు ఇది అర్థం కాలేదా? లేదా అతను దేశాన్ని వినాశనానికి నడిపిస్తున్నాడా? ఈ ఫాసిస్ట్ ఉగ్రవాది యూనస్ అధికారం కోసం దాహంతో మన దేశాన్ని నాశనం చేస్తున్నాడు’’ అని అన్నారు.
షేక్ హసీనాను గద్దె దించేందుకు చెలరేగిన అల్లర్లలో విద్యార్థి కార్యకర్త అబూ సయీద్ మరణించిన ఘటనపై ఆమె సందేహాలు వ్యక్తం చేశారు. సయీద్ మరణంపై పోలీసులు, నిరసనకారులు విరుద్ధమైన వాదనలు చేశారని, దీనిపై హసీనా అనుమానం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో, ఐక్యరాజ్యసమితి నిజనిర్ధారణ నివేదిక ప్రకారం, సయీద్ పోలీసులు “ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధంగా హత్య” చేయబడ్డారని పేర్కొంది. అయితే, పోలీసులు మెటల్ బుల్లెట్స్ వాడలేదని, రబ్బర్ బుల్లెట్స్ వాడారని హసీనా చెప్పారు.
ఈ కేసులో ఒక పోలీస్ ఉన్నతాధికారి నిజం చెప్పేందుకు ప్రయత్నిస్తే, అతడిని యూనస్ ప్రభుత్వం పదవి నుంచి తీసేసిందని ఆమె చెప్పారు. సయీద్ మృతదేహాన్ని వెలికితీసి మళ్లీ పోస్ట్మార్టం చేయాలని, మేము అతడిని చంపలేదని హసీనా చెప్పారు. కష్టపడి పనిచేసే బంగ్లాదేశీయుల కలల్ని యూనస్ తుడిచిపెట్టారని ఆమె ఆరోపించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!
-
Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
-
Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
-
Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్గా..!
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!