Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol Diesel Price Hike: గత కొన్ని నెలలుగా ప్రపంచ ఇంధన సంక్షోభానికి మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్రమై ఉద్రిక్తతలు ప్రధాన కారణం అయ్యాయి. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం మళ్లీ మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తలెత్తడంతో ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ మంటలకు పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి ఇంధన ధరలను పెంచింది. డాన్ పత్రికలోని ఒక నివేదిక ప్రకారం.. భారత పొరుగు దేశమైన పాకిస్థాన్లో పెట్రోల్ ధరను రూ.13.18 పాకిస్థానీ రూపాయలు, హై-స్పీడ్ డీజిల్ ధరను రూ.13.80 పాకిస్థానీ రూపాయలు పెంచినట్లు వెల్లడించారు. ముడి చమురు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా పెరుగుదల తరువాత, పాకిస్థాన్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.310.71 కి చేరింది. హై-స్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ.323.30 కి చేరింది. పెట్రోలియం విభాగం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ కొత్త ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. దీనివల్ల పాకిస్థానీయులందరూ ఇప్పుడు తమ ఆదాయంలో గణనీయమైన నష్టాన్ని ఎదుర్కుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి గతంలో కూడా పాకిస్థాన్ పెట్రోల్ – డీజిల్ ధరలను గణనీయంగా పెంచింది. ఫిబ్రవరి 28న డీజిల్ ధర లీటరుకు రూ.281కి చేరగా, ఏప్రిల్ 3న అది లీటరుకు రూ.530.35కి చేరింది. మార్చి మొదటి వారంలో లీటరుకు రూ.266గా ఉన్న పెట్రోల్ ధర, ఏప్రిల్ 3న లీటరుకు రూ.458.41కి పెంచింది. తర్వాత కాలంలో ఈ ధరలు కాస్త తగ్గిన ఇప్పుడు మళ్లీ పెరిగాయి.
Also Read
- Trump: డెమోక్రాట్లు గెలిస్తే అమెరికాకు అదే గతి.. స్పెయిన్ వలసపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
- Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
- Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు..
మధ్యప్రాచ్యంలో యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు సార్లు పెరిగాయి. మే 2026 నుంచి జరిగిన నాలుగు వేర్వేరు సందర్భాల్లో పెట్రోల్ ధర లీటరుకు మొత్తం రూ.7.8, డీజిల్ ధర రూ.8.7 పెరిగాయి. ఈ పెరుగుదలలతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102.12కి, డీజిల్ ధర లీటరుకు రూ.95.20కి చేరింది. ఇదే సమయంలో అంతర్జాతీయ పెట్రోల్ – డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే.. మిడిల్ ఈస్ట్ యుద్ద మేఘాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇటీవల యుద్ధం కారణంగా బ్రెంట్ ముడి చమురు బ్యారెల్కు $126 కు చేరుకుంది, కానీ ఇరాన్ – అమెరికా మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన తర్వాత, అది బ్యారెల్కు $72 కంటే తక్కువకు పడిపోయింది.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!