Pakistan: పాకిస్తాన్లో హిందువుల ఆందోళన.. హిందూ బాలికలు, మహిళల కిడ్నాపులు, మతమార్పిడిపై నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: మైనారిటీ హక్కుల గురించి భారతదేశానికి నీతులు చెప్పాలని ప్రయత్నించే పాకిస్తాన్ తన దేశంలో మైనారిటీల పరిస్థితిని పట్టించుకోవడం లేదు. ప్రతీ సంవత్సరం వందల్లో మహిళలు, బాలికలు కిడ్నాపులకు గురవుతూ.. బలవంతపు పెళ్లిళ్లు చేసి మతాన్ని మార్చేస్తున్నారు. ముఖ్యంగా సింధ్ రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశంలో హిందూ బాలికలు, మహిళల బలవంతమపు మతమార్పిడులు, వివాహాలపై పాకిస్తాన్ మైనారిటీ హిందూ సమాజానికి చెందిన పలువురు సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరాచీ ప్రెస్ క్లబ్ వెలుపల, సింధ్ అసెంబ్లీ భవనం ప్రవేశ ద్వారం వద్ద గురువారం పాకిస్తాన్ దారావర్ ఇత్తెహాద్ హిందూ సంస్థ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.
Read Also: Molestation : ఫ్రెండ్ పెళ్లాంపై కన్నేశాడు.. ముక్కలు ముక్కలయ్యాడు
Also Read
- Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
- Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
- Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
- Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
సింధ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 12 -13 ఏళ్ల వయసు ఉన్న బాలికను పట్టపగలే అపహరించుకుపోతున్నారని, బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారని, పెద్ద వయసు ఉన్న ముస్లింలో పెళ్లిళ్లు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ బాలికలు, మహిళల బలవంత మత మార్పిడిని వ్యతిరేకిస్తూ తీసుకువచ్చిన బిల్లు పాక్ పార్లమెంట్ లో నిలిచిపోయింది. బలవంతపు మతమార్పిడిని నేరంగా పరిగణించే బిల్లును పాకిస్తాన్ పార్లమెంట్ తిరస్కరించింది. ఇటీవల కాలంలో సింధ్ కోర్టుల్లో హిందూ తల్లిదండ్రుల కేసులు పెరిగిపోయాయి. తమ పిల్లలు, అక్కా చెల్లిళ్లు, భార్యలు ఎక్కడున్నారో తెలియజేయాలని, తమ వద్దకు తిరిగి తీసుకురావాలని కోర్టులో దరఖాస్తులు నమోదు అయ్యాయి.
మరోవైపు ఐక్యరాజ్యసమితి హక్కుల సంస్థ పాకిస్తాన్ లో హిందువులపై మతమార్పిడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతీ ఏడాది 1,000 మంది బాలికలు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబుతున్నారని హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆఫ్ పాకిస్తాన్ వెల్లడించింది. పాక్ లో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా ఉన్నారు. ముస్లిం మెజారిటీ దేశంలో దాదాపుగా 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. పాకిస్తాన్ మొత్తం 20 కోట్ల జనాభాలో ముస్లింలు 96 శాతం, హిందువులు 2.1 శాతం, క్రైస్తవులు 1.6 శాతం ఉన్నారు. ఎక్కువగా హిందువులు సింధ్ ప్రాంతంలో నివసిస్తున్నారు.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..