Pakistan: పాకిస్తాన్లో హిందువుల ఆందోళన.. హిందూ బాలికలు, మహిళల కిడ్నాపులు, మతమార్పిడిపై నిరసన
Pakistan: మైనారిటీ హక్కుల గురించి భారతదేశానికి నీతులు చెప్పాలని ప్రయత్నించే పాకిస్తాన్ తన దేశంలో మైనారిటీల పరిస్థితిని పట్టించుకోవడం లేదు. ప్రతీ సంవత్సరం వందల్లో మహిళలు, బాలికలు కిడ్నాపులకు గురవుతూ.. బలవంతపు పెళ్లిళ్లు చేసి మతాన్ని మార్చేస్తున్నారు. ముఖ్యంగా సింధ్ రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశంలో హిందూ బాలికలు, మహిళల బలవంతమపు మతమార్పిడులు, వివాహాలపై పాకిస్తాన్ మైనారిటీ హిందూ సమాజానికి చెందిన పలువురు సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరాచీ ప్రెస్ క్లబ్ వెలుపల, సింధ్ అసెంబ్లీ భవనం ప్రవేశ ద్వారం వద్ద గురువారం పాకిస్తాన్ దారావర్ ఇత్తెహాద్ హిందూ సంస్థ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.
Read Also: Molestation : ఫ్రెండ్ పెళ్లాంపై కన్నేశాడు.. ముక్కలు ముక్కలయ్యాడు
Also Read
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
సింధ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 12 -13 ఏళ్ల వయసు ఉన్న బాలికను పట్టపగలే అపహరించుకుపోతున్నారని, బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారని, పెద్ద వయసు ఉన్న ముస్లింలో పెళ్లిళ్లు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ బాలికలు, మహిళల బలవంత మత మార్పిడిని వ్యతిరేకిస్తూ తీసుకువచ్చిన బిల్లు పాక్ పార్లమెంట్ లో నిలిచిపోయింది. బలవంతపు మతమార్పిడిని నేరంగా పరిగణించే బిల్లును పాకిస్తాన్ పార్లమెంట్ తిరస్కరించింది. ఇటీవల కాలంలో సింధ్ కోర్టుల్లో హిందూ తల్లిదండ్రుల కేసులు పెరిగిపోయాయి. తమ పిల్లలు, అక్కా చెల్లిళ్లు, భార్యలు ఎక్కడున్నారో తెలియజేయాలని, తమ వద్దకు తిరిగి తీసుకురావాలని కోర్టులో దరఖాస్తులు నమోదు అయ్యాయి.
మరోవైపు ఐక్యరాజ్యసమితి హక్కుల సంస్థ పాకిస్తాన్ లో హిందువులపై మతమార్పిడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతీ ఏడాది 1,000 మంది బాలికలు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబుతున్నారని హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆఫ్ పాకిస్తాన్ వెల్లడించింది. పాక్ లో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా ఉన్నారు. ముస్లిం మెజారిటీ దేశంలో దాదాపుగా 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. పాకిస్తాన్ మొత్తం 20 కోట్ల జనాభాలో ముస్లింలు 96 శాతం, హిందువులు 2.1 శాతం, క్రైస్తవులు 1.6 శాతం ఉన్నారు. ఎక్కువగా హిందువులు సింధ్ ప్రాంతంలో నివసిస్తున్నారు.
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!