Molestation : ఫ్రెండ్ పెళ్లాంపై కన్నేశాడు.. ముక్కలు ముక్కలయ్యాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Molestation : స్నేహితుడి భార్యను మోహించిన యువకుడు ఆ దంపతుల చేతిలోనే కుక్క చావుచచ్చాడు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటుచేసుకుంది. స్నేహితుడిని హత్య చేసిన అనంతరం ఆ భార్యభర్తలు కత్తితో అతడి శరీరాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి కాలువలో పడేశాడు. నిందితుల జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహంలోని ఎనిమిది ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా భాగం కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. నిందితుడి నుంచి నేరానికి ఉపయోగించిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Tragedy : కోట్లు సంపాదించిపెట్టారు.. కొడుకులు కూడు పెట్టకపోవడంతో ఉసురుతీసుకున్నారు
Also Read
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
ఇమ్రాన్, రిజ్వానా ఇద్దరు దంపతులు. ఇమ్రాన్ స్నేహితుడు మెహరాజ్ పఠాన్. మెహ్రాజ్ తన స్నేహితుడు ఇమ్రాన్ భార్య రిజ్వానా సుల్తాన్పై చెడు దృష్టి పెడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అవకాశం దొరికినప్పుడల్లా ఆమెతో సరసాలాడుతూ శారీరక సంబంధాల కోసం ఒత్తిడి తెచ్చేవాడు. చివరకు ఈ విషయాన్ని రిజ్వానా తన భర్త ఇమ్రాన్కు తెలియజేసింది. దీని తర్వాత వారిద్దరూ మెహ్రాజ్కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు ఇమ్రాన్ మెహ్రాజ్ని తన ఇంటికి ఆహ్వానించాడు. తర్వాత సర్ ప్రైజ్ ఇస్తానన్న పేరుతో కళ్లకు కండువా కట్టాడు. ఆపై ఇమ్రాన్ను కత్తితో పొడిచి హత్య చేశాడు. దీని తరువాత, ఇద్దరూ మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి, మృతదేహాన్ని కాలువలోకి విసిరారు. మరోవైపు, మెహ్రాజ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో, అతని కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత మెహ్రాజ్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also:PM Modi: ప్రధాని డిగ్రీ వివరాలు అవసరం లేదు.. కేజ్రీవాల్కి హైకోర్టు జరిమానా..
ఇమ్రాన్ ఇంటికి వెళుతున్నానని చెప్పి మెహ్రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇమ్రాన్ను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. విచారణలో పోలీసులకు అనుమానం రావడంతో పోలీసులు అతడిని క్షుణ్ణంగా ప్రశ్నించారు. ఆ తర్వాత నేరం అంగీకరించి అన్ని విషయాలు చెప్పాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు భార్యాభర్తలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మొండెంనకు చెందిన ఎనిమిది ముక్కలు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు తల కోసం గాలిస్తున్నారు. కాల్వలో నీటి ప్రవాహానికి యువకుడి తల కొట్టుకుపోయి ఉండొచ్చని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!