Pakistan: “పాకిస్తాన్ ఉనికి ప్రమాదంలో ఉంది”.. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు..
- పాకిస్తాన్కి వణుకు పుట్టిస్తున్న బీఎల్ఏ, తాలిబన్లు..
- వరస దాడులతో దద్దరిల్లుతున్న దాయాది దేశం..
- పాక్ ఉనికి ప్రమాదంలో ఉందన్న ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు, ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. బెలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. బలూచ్ ప్రావిన్సుల్లో పనిచేయడానికి ఆర్మీ అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు భయపడి చస్తున్నారు. ఇటీవల, క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ రైలుని హైజాక్ చేసి, 200 కి పైగా ఆర్మీ అధికారులు, ఐఎస్ఐ సిబ్బందిని బీఎల్ఏ హతమార్చింది. ఇది జరిగిన కొన్ని రోజులకే బలూచ్ ప్రావిన్సులోని నోష్కి ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై దాడిచేసి 90 మందిని హతమార్చింది. మరోవైపు, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో పాక్ తాలిబాన్లు విరుచుకుపడుతున్నారు. సింధ్ ప్రాంతంలో కూడా సింధుస్తాన్, సింధుదేశ్ వంటి ప్రత్యేక దేశం కోసం డిమాండ్లు వస్తున్నాయి. పీఓకే ప్రాంత ప్రజలు భారత్లో కలుస్తామని ఉద్యమిస్తున్నారు.
Read Also: Vizag and Vijayawada Metro Rail: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం గుడ్న్యూస్..
Also Read
- DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ భవిష్యత్తు అంధకారంగా మారింది. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీఎల్ఏ చేతిలో చావుదెబ్బలు తిన్న తర్వాత ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ని ‘‘స్ట్రిక్ట్’’గా మార్చాలని చెప్పారు. దేశ ఉనికి ప్రమాదంలో ఉందని, ఉగ్రవాదంపై యుద్ధం దేశాన్ని కాపాడుకోవడానికే అని చెప్పారు. జాతీయ భద్రతపై పార్లమెంటరీ కమిటీ ఉన్నత స్థాయి సమావేశంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ షాబాజ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాలనను మెరుగుపరచాలని ఆయన ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ను కోరారు. పాకిస్తాన్ స్ట్రిక్ట్గా లేకపోవడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన చెప్పారు. పాలనలో అంతరాల వల్ల పాకిస్తాన్ సైన్యం, సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది ఎంత కాలం అంటూ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!