Pakistan: “పాకిస్తాన్ ఉనికి ప్రమాదంలో ఉంది”.. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు..
- పాకిస్తాన్కి వణుకు పుట్టిస్తున్న బీఎల్ఏ, తాలిబన్లు..
- వరస దాడులతో దద్దరిల్లుతున్న దాయాది దేశం..
- పాక్ ఉనికి ప్రమాదంలో ఉందన్న ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు, ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. బెలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. బలూచ్ ప్రావిన్సుల్లో పనిచేయడానికి ఆర్మీ అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు భయపడి చస్తున్నారు. ఇటీవల, క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ రైలుని హైజాక్ చేసి, 200 కి పైగా ఆర్మీ అధికారులు, ఐఎస్ఐ సిబ్బందిని బీఎల్ఏ హతమార్చింది. ఇది జరిగిన కొన్ని రోజులకే బలూచ్ ప్రావిన్సులోని నోష్కి ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై దాడిచేసి 90 మందిని హతమార్చింది. మరోవైపు, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో పాక్ తాలిబాన్లు విరుచుకుపడుతున్నారు. సింధ్ ప్రాంతంలో కూడా సింధుస్తాన్, సింధుదేశ్ వంటి ప్రత్యేక దేశం కోసం డిమాండ్లు వస్తున్నాయి. పీఓకే ప్రాంత ప్రజలు భారత్లో కలుస్తామని ఉద్యమిస్తున్నారు.
Read Also: Vizag and Vijayawada Metro Rail: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం గుడ్న్యూస్..
Also Read
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ భవిష్యత్తు అంధకారంగా మారింది. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీఎల్ఏ చేతిలో చావుదెబ్బలు తిన్న తర్వాత ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ని ‘‘స్ట్రిక్ట్’’గా మార్చాలని చెప్పారు. దేశ ఉనికి ప్రమాదంలో ఉందని, ఉగ్రవాదంపై యుద్ధం దేశాన్ని కాపాడుకోవడానికే అని చెప్పారు. జాతీయ భద్రతపై పార్లమెంటరీ కమిటీ ఉన్నత స్థాయి సమావేశంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ షాబాజ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాలనను మెరుగుపరచాలని ఆయన ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ను కోరారు. పాకిస్తాన్ స్ట్రిక్ట్గా లేకపోవడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన చెప్పారు. పాలనలో అంతరాల వల్ల పాకిస్తాన్ సైన్యం, సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది ఎంత కాలం అంటూ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!