Hinglaj Mata festival: పాకిస్తాన్లో “హింగ్లాజ్ మాత” తీర్థయాత్ర.. లక్షలాదిగా హిందువులు హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hinglaj Mata festival: పాకిస్తాన్లో ఎంతో ప్రముఖమైన హిందూ ఆలయం “హింగ్లాజ్ మాత” మందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ తీర్థయాత్రకు లక్షలాది హిందువులు హాజరవుతున్నారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న ఈ ఆలయానికి వెళ్తున్నారు. ముఖ్యంగా సింధ్ ప్రావిన్సులోని హైదరాబాద్, కరాచీ ప్రాంతాల నుంచి హిందూ యాత్రికులు ఎక్కువగా ఈ తీర్థయాత్రకు హాజరవుతున్నారు. ఈ యాత్రకు వెళ్లే ముందు దారిలో ఉన్న ఓ మట్టి అగ్నిపర్వాతాన్ని అదిరోహించిన తర్వాత ఈ పవిత్రమైన తీర్థయాత్రను ప్రారంభిస్తారు.

Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
Read Also: Kesineni Nani: పార్టీ లైన్లో గతంలో సీఎం జగన్పై విమర్శలు చేశా..
నిటారుగా ఉన్న పర్వతం పైకి ఎక్కి అక్కడ కొబ్బరికాయల్ని, గులాబీ రేకులను ఉంచి, హింగ్లాజ్ మాతను సందర్శించేందుకు దైవ అనుమతిని కోరుతారు. హింగ్లాజ్ మాత వేడుకలు శుక్రవారంతో ప్రారంభమై ఆదివారంతో ముగుస్తున్నాయి. 1,00,000 మందికి పైగా హిందువులు పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు. ముస్లిం మెజారిటీ ఉన్న పాకిస్తాన్ దేశంలో 44 లక్షల మంది హిందువులు ఉన్నారు. అంటే ఆ దేశ జనాభాలో కేవలం 2.14 శాతం మాత్రమే. దాంతప్య సౌభాగ్యం, దీర్ఘాయువుకి దేవత అయిన సతీదేవీ తన జీవితాన్ని ముగించిన తర్వాత భూమిపై వెలిసిన సతీదేవీ రూపంగా హింగ్లాజ్ మాతను హిందువులు ఆరాధిస్తారు. ఇది హిందూమతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రల్లో ఒకటి. మూడు రోజుల పాటు ఎవరైతే ఆలయాన్ని దర్శించి పూజిస్తారో వారి పాపాలన్నీ క్షమించబడతాయని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!