Pak On Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగంపై పాకిస్తాన్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak On Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగంపై ప్రపంచ దేశాలు భారత్కు అభినందనలు తెలపడంతోపాటు.. విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాయి. చంద్రయాన్-3 విజయవంతం కావాలని కోరుకుంటూ ఇప్పటికే బ్రిటన్, అమెరికా వంటి దేశాలు సందేశాలు పంపగా.. తాజాగా పాకిస్తాన్ మాజీ మంత్రి సైతం ఇండియా చంద్రయాన్-3 ప్రయోగానికి అభినందనలు తెలుపుతూ.. విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని పాకిస్తాన్లో లైవ్ టెలీకాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మీడియా ప్రసారం చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా వ్యవహారించిన ఫవాద్ చౌదరి సూచించారు. ఈ మిషన్ మానవజాతికి చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణిస్తూ భారత శాస్త్రవేత్తలు మరియు అంతరిక్ష సంఘాన్ని కూడా ఆయన అభినందించారు. మంగళవారం ట్విట్టర్ X లో (గతంలో ట్విటర్గా పిలువబడేది)లో షేర్ చేసిన పోస్ట్లో ఫవాద్ చౌదరి “పాక్ మీడియా రేపు సాయంత్రం 6:15 గంటలకు చంద్రయాన్ మూన్ ల్యాండింగ్ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి…ప్రత్యేకంగా ప్రజలు, శాస్త్రవేత్తల కోసం మానవ జాతికి చారిత్రాత్మక క్షణం. మరియు స్పేస్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియాకి…. చాలా అభినందనలు.” అని పోస్టు చేశారు.
Read Also: Naveen Krishna: పవిత్ర లోకేశ్ అలాంటి వ్యక్తి.. నరేష్ కొడుకు సంచలన వ్యాఖ్యలు
Also Read
- Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
చంద్రయాన్-3 ల్యాండింగ్ సాయంత్రం 6.04 గంటలకు జరగనుండగా దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆన్లైన్లో పాల్గొననున్నారు. ల్యాండింగ్ సమయంలో ఆదివారం చంద్రుని ఉపరితలంపై రష్యా చంద్ర మిషన్ లూనా-25 విఫలమవడంతో ఉత్కంఠ నెలకొంది. 2019 లో, చంద్రయాన్-2 మిషన్ అదే ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంలో విఫలమైంది. ఇది క్రేటర్స్ మరియు లోతైన కందకాలతో నిండి ఉంది. శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 నుండి నేర్చుకున్న విలువైన పాఠాలన్నీ పరిశీలించుకొన్న నేపథ్యంలో ల్యాండింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందని అంతరిక్ష సంస్థ ఇస్రో విశ్వాసం వ్యక్తం చేసింది. చంద్రయాన్-3 మిషన్ చంద్రుని తాకడంలో మరియు ఇస్రో యొక్క రెండవ ప్రయత్నంలో రోబోటిక్ లూనార్ రోవర్ను ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైతే, అమెరికా తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్-ల్యాండింగ్ సాంకేతికతను సాధించిన నాల్గవ దేశంగా భారతదేశం అవుతుంది.
తాజావార్తలు
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్టాప్ బహుకరించిన మెగాస్టార్
-
Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
RRB Technician 2026: నిరుద్యోగులకు గోల్డెన్ చాన్స్.. రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తు, అర్హత పూర్తి వివరాలు
-
Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
-
Luger : ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..! షాక్లో ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!