Pak On Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగంపై పాకిస్తాన్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak On Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగంపై ప్రపంచ దేశాలు భారత్కు అభినందనలు తెలపడంతోపాటు.. విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాయి. చంద్రయాన్-3 విజయవంతం కావాలని కోరుకుంటూ ఇప్పటికే బ్రిటన్, అమెరికా వంటి దేశాలు సందేశాలు పంపగా.. తాజాగా పాకిస్తాన్ మాజీ మంత్రి సైతం ఇండియా చంద్రయాన్-3 ప్రయోగానికి అభినందనలు తెలుపుతూ.. విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని పాకిస్తాన్లో లైవ్ టెలీకాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మీడియా ప్రసారం చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా వ్యవహారించిన ఫవాద్ చౌదరి సూచించారు. ఈ మిషన్ మానవజాతికి చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణిస్తూ భారత శాస్త్రవేత్తలు మరియు అంతరిక్ష సంఘాన్ని కూడా ఆయన అభినందించారు. మంగళవారం ట్విట్టర్ X లో (గతంలో ట్విటర్గా పిలువబడేది)లో షేర్ చేసిన పోస్ట్లో ఫవాద్ చౌదరి “పాక్ మీడియా రేపు సాయంత్రం 6:15 గంటలకు చంద్రయాన్ మూన్ ల్యాండింగ్ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి…ప్రత్యేకంగా ప్రజలు, శాస్త్రవేత్తల కోసం మానవ జాతికి చారిత్రాత్మక క్షణం. మరియు స్పేస్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియాకి…. చాలా అభినందనలు.” అని పోస్టు చేశారు.
Read Also: Naveen Krishna: పవిత్ర లోకేశ్ అలాంటి వ్యక్తి.. నరేష్ కొడుకు సంచలన వ్యాఖ్యలు
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
చంద్రయాన్-3 ల్యాండింగ్ సాయంత్రం 6.04 గంటలకు జరగనుండగా దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆన్లైన్లో పాల్గొననున్నారు. ల్యాండింగ్ సమయంలో ఆదివారం చంద్రుని ఉపరితలంపై రష్యా చంద్ర మిషన్ లూనా-25 విఫలమవడంతో ఉత్కంఠ నెలకొంది. 2019 లో, చంద్రయాన్-2 మిషన్ అదే ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంలో విఫలమైంది. ఇది క్రేటర్స్ మరియు లోతైన కందకాలతో నిండి ఉంది. శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 నుండి నేర్చుకున్న విలువైన పాఠాలన్నీ పరిశీలించుకొన్న నేపథ్యంలో ల్యాండింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందని అంతరిక్ష సంస్థ ఇస్రో విశ్వాసం వ్యక్తం చేసింది. చంద్రయాన్-3 మిషన్ చంద్రుని తాకడంలో మరియు ఇస్రో యొక్క రెండవ ప్రయత్నంలో రోబోటిక్ లూనార్ రోవర్ను ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైతే, అమెరికా తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్-ల్యాండింగ్ సాంకేతికతను సాధించిన నాల్గవ దేశంగా భారతదేశం అవుతుంది.
తాజావార్తలు
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!