Pak On Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగంపై పాకిస్తాన్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak On Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగంపై ప్రపంచ దేశాలు భారత్కు అభినందనలు తెలపడంతోపాటు.. విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాయి. చంద్రయాన్-3 విజయవంతం కావాలని కోరుకుంటూ ఇప్పటికే బ్రిటన్, అమెరికా వంటి దేశాలు సందేశాలు పంపగా.. తాజాగా పాకిస్తాన్ మాజీ మంత్రి సైతం ఇండియా చంద్రయాన్-3 ప్రయోగానికి అభినందనలు తెలుపుతూ.. విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని పాకిస్తాన్లో లైవ్ టెలీకాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మీడియా ప్రసారం చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా వ్యవహారించిన ఫవాద్ చౌదరి సూచించారు. ఈ మిషన్ మానవజాతికి చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణిస్తూ భారత శాస్త్రవేత్తలు మరియు అంతరిక్ష సంఘాన్ని కూడా ఆయన అభినందించారు. మంగళవారం ట్విట్టర్ X లో (గతంలో ట్విటర్గా పిలువబడేది)లో షేర్ చేసిన పోస్ట్లో ఫవాద్ చౌదరి “పాక్ మీడియా రేపు సాయంత్రం 6:15 గంటలకు చంద్రయాన్ మూన్ ల్యాండింగ్ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి…ప్రత్యేకంగా ప్రజలు, శాస్త్రవేత్తల కోసం మానవ జాతికి చారిత్రాత్మక క్షణం. మరియు స్పేస్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియాకి…. చాలా అభినందనలు.” అని పోస్టు చేశారు.
Read Also: Naveen Krishna: పవిత్ర లోకేశ్ అలాంటి వ్యక్తి.. నరేష్ కొడుకు సంచలన వ్యాఖ్యలు
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
చంద్రయాన్-3 ల్యాండింగ్ సాయంత్రం 6.04 గంటలకు జరగనుండగా దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆన్లైన్లో పాల్గొననున్నారు. ల్యాండింగ్ సమయంలో ఆదివారం చంద్రుని ఉపరితలంపై రష్యా చంద్ర మిషన్ లూనా-25 విఫలమవడంతో ఉత్కంఠ నెలకొంది. 2019 లో, చంద్రయాన్-2 మిషన్ అదే ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంలో విఫలమైంది. ఇది క్రేటర్స్ మరియు లోతైన కందకాలతో నిండి ఉంది. శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 నుండి నేర్చుకున్న విలువైన పాఠాలన్నీ పరిశీలించుకొన్న నేపథ్యంలో ల్యాండింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందని అంతరిక్ష సంస్థ ఇస్రో విశ్వాసం వ్యక్తం చేసింది. చంద్రయాన్-3 మిషన్ చంద్రుని తాకడంలో మరియు ఇస్రో యొక్క రెండవ ప్రయత్నంలో రోబోటిక్ లూనార్ రోవర్ను ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైతే, అమెరికా తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్-ల్యాండింగ్ సాంకేతికతను సాధించిన నాల్గవ దేశంగా భారతదేశం అవుతుంది.
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..