Pakistan: ఆఫ్ఘన్ శరణార్థులకు పాకిస్తాన్ మరో వార్నింగ్.. నవంబర్ 1 డెడ్లైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: వేల మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ వదిలివెళ్లాలని లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులందరూ.. నవంబర్ 1 కంటే ముందే దేశం నుంచి వెళ్లిపోవాలని పాకిస్తాన్ గురువారం చివరిసారిగా హెచ్చరించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వంలోని అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. నవంబర్ 1 తర్వాత పత్రాలు లేని వలసదారులందరిని తొలగించే ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని పాక్ కృతనిశ్చయంతో ఉంది.
పాకిస్తాన్ లో ఇటీవల జరిగిన పలు ఉగ్రవాద కార్యకలాపాలు, బాంబు పేలుళ్లలో ఆఫ్ఘన్ జాతీయులు ఉన్నారని తేలడంతోనే ఈ నిర్ణయం తసుకున్నట్లు దాయాది దేశం పేర్కొంది. ఇప్పటికే అక్రమ వలసదారులను గుర్తించామని, గడువులోగా స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని మంత్రి బుగ్తీ మరోసారి చెప్పారు. గడువు ముగిసిన తర్వాత అక్రమవలసదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ చేపడుతుందని అన్నారు. వలసదారులను దాచిపెట్టడంలో ప్రేమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
Also Read
- Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. "మహామంత్రం" జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
- Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
- XI Jinping: చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు గుండెపోటు..? వారసుడిని ప్రకటిస్తే తిరుగుబాటు భయం.?
- Miracle Rescue: నేపాల్లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
Read Also: Rahul Gandhi: 2024లో పీఎం రాహుల్ గాంధీనే.. మిత్రపక్షం విమర్శలు..
వలసదారుల్లో ఎక్కువగా ఆఫ్ఘన్లు చాలా ఏళ్లుగా పాకిస్తాన్ లో ఉంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక కేంద్రాలో వీరు ఉంటున్నారు. 1979లో ఆఫ్ఘనిస్తాన్ పై రష్యా దండయాత్ర తర్వాత అత్యధికంగా ఆఫ్ఘన్లు పాకిస్తాన్ లోకి వచ్చారు. యుద్ధం, సంఘర్షణను తప్పించుకునేందుకు వేలాది మంది ఆఫ్ఘన్ ప్రజలు పాకిస్తాన్ లోకి వచ్చారు. అనేక మంది ప్రభుత్వం, యూఎన్ ఏజెన్సీల వద్ద శరణార్థులుగా నమోదు చేయబడ్డారు.
ఇటీవల కాలంలో పాకిస్తాన్ వ్యాప్తంగా ముఖ్యంగా సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో భారీ పేలుళ్లు జరిగాయి. కొన్ని రోజుల క్రితం బలూచిస్తాన్ లో ఓ మతపరమైన కార్యక్రమంలో బాంబు పేలుడు కారణంగా 50 మందికి పైగా మరణించారు. ఇదిలా ఉంటే భారత్ కి మోస్ట్ వాంటెడ్ గా ఉన్న పలువురు ఉగ్రవాదుల్ని కూడా గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. అయితే ఈ ఘటనల్లో ఆఫ్ఘన్ జాతీయుల ప్రమేయం ఉన్నట్లు పాక్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్రమ వలసదారుల్ని, ముఖ్యంగా ఆఫ్ఘన్లను దేశం వదిలేయాలంటూ పాకిస్తాన్ హెచ్చరిస్తోంది.
తాజావార్తలు
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
-
AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
-
Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!