Pakistan train hijack:100 మంది బందీలను రక్షించిన పాకిస్తాన్ సైన్యం.. 16 మంది మిలిటెంట్లు హతం
- 100 మంది బందీలను రక్షించిన పాకిస్తాన్ సైన్యం
- 16 మంది మిలిటెంట్లు హతం
- BLA మిలిటెంట్లు, పాకిస్తాన్ సైన్యం మధ్య భారీ కాల్పులు కొనసాగుతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బలూచిస్తాన్లోని బోలాన్ జిల్లా సమీపంలో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న ప్యాసింజర్ రైలును మంగళవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపి హైజాక్ చేశారు. ఈ చర్యతో పాక్ ఉలిక్కిపడింది. వెంటనే రంగంలోకి దిగిన పాక్ సైన్యం రెస్య్కూ ఆపరేషన్ ప్రారంభించింది. మిలిటెంట్లు బంధించిన పాక్ ప్రజలను విడిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ దాడికి పాల్పడింది తామేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. పాక్ సైన్యం ఇప్పటివరకు 16 మంది BLA మిలిటెంట్లను హతం చేసినట్లు తెలిసింది. బందీలుగా ఉన్న100 మందికి పైగా ప్రయాణికులను పాక్ సైన్యం రక్షించింది.
Also Read:Sandeep Reddy : ప్రభాస్ కే కండీషన్లు పెడుతున్న సందీప్ రెడ్డి.. అలా ఉంటేనే ఓకే
Also Read
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
నిన్న రాత్రి నుంచి BLA మిలిటెంట్లు, పాకిస్తాన్ సైన్యం మధ్య భారీ కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పుల్లో చాలా మంది ప్రయాణికులు కూడా గాయపడ్డారు. ఉగ్రవాదులు బందీలుగా ఉంచిన 100 మందికి పైగా ప్రజలను భద్రతా దళాలు రక్షించాయని రేడియో పాకిస్తాన్ నివేదించింది. రక్షించబడిన వారిలో 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నారని భద్రతా వర్గాలు తెలిపాయి. కాల్పుల్లో గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, భద్రతా దళాల ఆపరేషన్ కారణంగా ఉగ్రవాదులు చిన్న గ్రూపులుగా విడిపోయి కాల్పులకు తెగబడుతున్నారని నివేదిక పేర్కొంది.
Also Read:Perni Nani: మచిలీపట్నంలో ఉద్రిక్తత.. వైసీపీ ఆఫీస్ ర్యాంప్ కూల్చివేత.. పేర్నినాని సీరియస్!
కాగా తమపై మిలిటరీ ఆపరేషన్ చేపడితే బందీలుగా ఉన్నవారందరినీ చంపుతామని బెదిరించింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. బందీలను విడిచిపెట్టాలంటే బలోచ్ రాజకీయ నేరస్థులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం 48 గంటల సమయం విధిస్తున్నట్లు వెల్లడించారు. బలూచ్ పౌరులపై పాకిస్థాన్ ప్రభుత్వం సాగించిన మారణకాండ, దాడులే వారు ఆ దేశం నుంచి విడిపోవాలని కోరుకోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!