Pakistan: ‘‘పారిస్ మేం వస్తున్నాం’’.. నవ్వుల పాలైన పాక్ ఎయిర్లైన్స్ పోస్ట్..
- నవ్వులపాలైన పాకిస్తాన్ ఎయిర్ లైన్స్..
- ‘‘పారిస్ మేం వస్తున్నాం’’ సోషల్ మీడియా పోస్ట్పై సెటైర్లు..
- అమెరికా 9/11 దాడుల్ని తలపిస్తోందన్న నెటిజన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: యూరోపియన్ యూనియన్(ఈయూ) సేఫ్టీ ఏజెన్సీ పాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్లైన్స్(పీఐఏ)పై విధించిన నాలుగేళ్ల బ్యాన్ని ఎత్తేసింది. కరాచీలో ల్యాండ్ అవుతున్న సమయంలో పీఐఏకి చెందిన విమానం 2020లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 97 మంది ప్రయాణికులు మరణించారు. అయితే, పాకిస్తాన్ పైలెట్లకు సరైన ట్రైనింగ్ లేదని కారణంగా నిషేధాన్ని విధించింది.
Read Also: Adam Gilchrist: ఇంటికి వెళ్లి కొడుకు డైపర్లు మార్చుకో అంటూ.. టీమిండియా కెప్టెన్కు అవమానం
Also Read
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
ఇదిలా ఉంటే, నిషేధం ఎత్తివేసిన తర్వాత పీఐఏ ఓ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. ఈ పోస్టులో పాకిస్తాన్ నవ్వులపాలైంది. నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘‘పారిస్ మేము వస్తున్నాం’’ అంటూ పీఐఏ విమానాన్ని, ఈఫిల్ టవర్ని కలిగిన ఫోటోని పోస్ట్ చేసింది. అయితే, ఈ ఫోటోలో విమానం, ఈఫిట్ టవర్ని ఢీకొట్టేందుకు వెళ్తున్నట్లు ఉంది. దీనిపై నెటిజన్లు వ్యంగ్యంగా రియాక్ట్ అవుతున్నారు. జనవరి 10 నుండి ఇస్లామాబాద్ నుండి పారిస్కు విమాన ప్రయాణాన్ని ప్రారంభించడాన్ని ప్రోత్సహించే ఈ ప్రకటనలో, “పారిస్, మేము ఈరోజు వస్తున్నాము” అనే ట్యాగ్లైన్తో ఈ ఫోటోని షేర్ చేసింది.
అయితే, ఈ ఫోటో 2001లో అమెరికా ట్విట్ టవర్స్ 9/11 దాడిని గుర్తు చేస్తున్నట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది. మరికొందరు యూకేలో ‘‘పాకిస్తాన్ గ్రూమింగ్ గ్యాంగ్స్’’ అక్కడి బ్రిటన్ మైనర్ బాలికలపై చేసిన లైంగిక దాడులను లింక్ చేశారు. ‘‘పాకిస్తాన్ మళ్లీ అవమానం ఎదుర్కొంటోంది’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పీఐఏ పోస్ట్ పాకిస్తాన్ మద్దతు కలిగిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ని గుర్తు చేస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!