Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
- పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసీమ్ తారిక్ హత్య.
- మహిళ అపహరణ ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో కాల్పులు.
- ఘటన అనంతరం నిందితుడు పరారీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో ఆ దేశ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ను గుర్తుతెలియని దండగుడు కాల్చి చంపాడు. ఆదివారం ఇస్లామాబాద్లోని షాహీన్ చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఒక మహిళను గుర్తుతెలియని యువకుడు కారులో బలవంతంగా ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా, అటుగా వెళ్తున్న అసిమ్ తారిఖ్ కాపాడే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ యువకుడు అతడిని తుపాకీతో కాల్చి, అక్కడి నుంచి పరారయ్యాడు. బుల్లెట్ గాయంతో తారిఖ్ అక్కడిక్కడే మరణించాడు. అతడి మృతదేహాన్ని పాక్ వైమానిక దళ ఆస్పత్రికి తరలించారు.
నిమ్రాగా గుర్తించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాక్ మీడియా చెబుతున్న వివరాల ప్రకారం, నిందితుడు మహిళకు తెలిసిన సహోద్యోగే అని, అతడి పేరు సాద్ అని గుర్తించారు. తనకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి, దారి మళ్లించి తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు మహిళ ఆరోపించింది. ఫెడరల్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసి, మృతుని కుటుంబానికి హృదయపూర్వక సంతాపం తెలిపారు. నిందితుడి కోసం ఇస్లామాబాద్ వ్యాప్తంగా గాలిస్తున్నారు.
Also Read
- China: భారత్, హిందూ మహాసముద్రమే టార్గెట్?.. 5,000 కి.మీ LPAR రాడార్తో చైనా కొత్త సవాల్
- Explainer: 14,500కిలోమీటర్లు పొడవు.. రాక్షస అల మేల్కొందా?
- S8000 Banderol: చైనా ఇంజిన్.. అమెరికా టెక్నాలజీ.. రష్యా కొత్త క్షిపణి ఉక్రెయిన్కు పెద్ద సవాల్
- Ali Khamenei Funeral: తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేనీ గైర్హాజరు.. ఇజ్రాయిల్ భయమే కారణమా.?
ఈ ఘటనకు ముందు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని మొహమండ్ జిల్లాలో శుక్రవారం సాయుధ దుండగులు పోలీసు పెట్రోలింగ్పై దాడి చేయడంతో, ఒక అదనపు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)తో సహా ఇద్దరు పాకిస్తానీ పోలీసు సిబ్బంది మరణించారని అక్కడి మీడియా వెల్లడించింది. ఈ దాడికి పాల్పడింది నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)కు చెందిన ఉగ్రవాదులనే ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
-
CM Chandrababu : కుప్పం రైతులకు చంద్రబాబు బిగ్ గిఫ్ట్..!
-
PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
-
Team India: ఇంగ్లాండ్ గడ్డపై శతకాలు బాదిన ముగ్గురు మొనగాళ్లు ఎవరో తెలుసా..? అందులో సూర్య కూడా..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!