Kenya drought: కెన్యాలో కరువు తాండవం..వేలాదిగా చనిపోతున్న వన్యప్రాణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Over 1,000 zebras, elephants and wildebeest die after Kenya drought: ఆఫ్రికాదేశం కెన్యాలో కరువు తాండవిస్తోంది. అక్కడి ప్రజలతో పాటు వన్య ప్రాణులు కరువుబారిన పడి అల్లాడుతున్నాయి. కెన్యాలో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని అత్యంత దారుణమైన కరువును ఎదుర్కొంటోంది. ముఖ్యంగా వన్య ప్రాణులు కరువు దెబ్బకు వేలాదిగా చనిపోతున్నాయి. ఇప్పటి వరకు 512 వైల్డ్ బీస్ట్, 381 జీబ్రాలు, 205 ఏనుగులు, 49 గ్రేవీస్ జీబ్రాలు, 51 అడవి బర్రెలు చనిపోయాయని కెన్యా ప్రభుత్వ అధ్యయనంలో తేలింది.
Read Also: RRR Record Collections: జపాన్లో రికార్డు వసూళ్లు రాబట్టుతున్న ట్రిపుల్ఆర్ మూవీ.. మొత్తం కోట్లంటే
Also Read
- Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
- WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
మాంసాహార జంతువుల కన్నా ఈ కరువు వల్ల శాఖాహార జంతువులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. నీటి కొరత, గడ్డి కొరత కారణంగా వన్యప్రాణులు ప్రాణాలు వదులుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ కెన్యాలో కరువు తీవ్రం అవుతోంది. ఫిబ్రవరి, అక్టోబర్ 2022 మధ్య వన్యప్రాణుల మరణానే ఇందుకు నిదర్శనం అని ప్రభుత్వం చెబుతోంది. కెన్యా మొత్తం ఏనుగు జనాభాలో అంబోసెలి, త్సావో, లైకిపియ-సంబురు ప్రాంతాల్లోనే 65 శాతం ఏనుగులు నివాసం ఉంటున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లోనే కరువు ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
వ్యవసాయ ఎగుముతులు తర్వాత కెన్యాకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. కెన్యా దేశానికి మూడవ అతిపెద్ద విదేశీ మారకాన్ని ఆర్జించేది పర్యాటకమే. ఈ దేశంలో వన్యప్రాణి నేషనల్ పార్కులను చూసేందుకు ప్రపంచం నుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇప్పుడు అలాంటి పర్యాటకంపై కరువు ప్రభావం పడుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మాసైమారా నేషనల్ పార్క్, నైరోబీ, అంబొసేలీ, త్సావో, మౌంట్ కెన్యా నేషనల్ పార్కులు ఉన్నాయి. వీటిలోని వన్యప్యాణులను చూసేందుకు ఏటా కొన్ని లక్షల మంది పర్యాటకులు కెన్యాకు వస్తుంటారు.
తాజావార్తలు
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..