Kenya drought: కెన్యాలో కరువు తాండవం..వేలాదిగా చనిపోతున్న వన్యప్రాణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Over 1,000 zebras, elephants and wildebeest die after Kenya drought: ఆఫ్రికాదేశం కెన్యాలో కరువు తాండవిస్తోంది. అక్కడి ప్రజలతో పాటు వన్య ప్రాణులు కరువుబారిన పడి అల్లాడుతున్నాయి. కెన్యాలో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని అత్యంత దారుణమైన కరువును ఎదుర్కొంటోంది. ముఖ్యంగా వన్య ప్రాణులు కరువు దెబ్బకు వేలాదిగా చనిపోతున్నాయి. ఇప్పటి వరకు 512 వైల్డ్ బీస్ట్, 381 జీబ్రాలు, 205 ఏనుగులు, 49 గ్రేవీస్ జీబ్రాలు, 51 అడవి బర్రెలు చనిపోయాయని కెన్యా ప్రభుత్వ అధ్యయనంలో తేలింది.
Read Also: RRR Record Collections: జపాన్లో రికార్డు వసూళ్లు రాబట్టుతున్న ట్రిపుల్ఆర్ మూవీ.. మొత్తం కోట్లంటే
Also Read
మాంసాహార జంతువుల కన్నా ఈ కరువు వల్ల శాఖాహార జంతువులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. నీటి కొరత, గడ్డి కొరత కారణంగా వన్యప్రాణులు ప్రాణాలు వదులుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ కెన్యాలో కరువు తీవ్రం అవుతోంది. ఫిబ్రవరి, అక్టోబర్ 2022 మధ్య వన్యప్రాణుల మరణానే ఇందుకు నిదర్శనం అని ప్రభుత్వం చెబుతోంది. కెన్యా మొత్తం ఏనుగు జనాభాలో అంబోసెలి, త్సావో, లైకిపియ-సంబురు ప్రాంతాల్లోనే 65 శాతం ఏనుగులు నివాసం ఉంటున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లోనే కరువు ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
వ్యవసాయ ఎగుముతులు తర్వాత కెన్యాకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. కెన్యా దేశానికి మూడవ అతిపెద్ద విదేశీ మారకాన్ని ఆర్జించేది పర్యాటకమే. ఈ దేశంలో వన్యప్రాణి నేషనల్ పార్కులను చూసేందుకు ప్రపంచం నుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇప్పుడు అలాంటి పర్యాటకంపై కరువు ప్రభావం పడుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మాసైమారా నేషనల్ పార్క్, నైరోబీ, అంబొసేలీ, త్సావో, మౌంట్ కెన్యా నేషనల్ పార్కులు ఉన్నాయి. వీటిలోని వన్యప్యాణులను చూసేందుకు ఏటా కొన్ని లక్షల మంది పర్యాటకులు కెన్యాకు వస్తుంటారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!