Oxygen on Mars: అంగారకుడిపై ఆక్సిజన్ తయారు చేసిన పర్సెవరెన్స్ రోవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oxygen on Mars: అంగారక గ్రహంపైకి 2021లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) పంపిన పర్సెవెరెన్స్ రోవర్ మరో ఘనత సాధించింది. ఇప్పటికే అక్కడి వాతావరణం, మట్టి నమూనాలను విశ్లేషిస్తున్న ఈ రోవర్ ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది. దీంతో వెళ్లిన బుల్లి హెలికాప్టర్ కూడా అక్కడి వాతావరణంలో పలుమార్లు పైకి ఎగిరింది. తాజాగా ఈ రోవర్ లో ఓవెన్ పరిమాణంలో ఉన్న ఓ యంత్రం అంగారకుడిపై ఆక్సిజన్ని ఉత్పత్తి చేసింది. ఈ ప్రయోగం ద్వారా అరుణ గ్రహంపై ప్రాణవాయువు ఉత్పత్తి చేయవచ్చని నిరూపించింది.
అంగారకుడిపై భవిష్యత్తులో మానవ ఆవాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఈ ప్రయోగం దోహదపడతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్పెరిమెంట్(MOXIE)’ అనే పరికరం ఆక్సిజన్ ని తయారుచేసి తన మిషన్ పూర్తి చేసింది. మైక్రో ఓవెన్ పరిమాణంలో ఉండే ఈ పరికరం 2021లో పర్సెవరెన్స్ రోవర్ ల్యాండైనప్పటి నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది. MOXIE ఇప్పటి వరకు 122 గ్రాముల ఆక్సిజన్ ఉత్పత్తి చేసినట్లు నాసా తెలిపింది. ఇది నాసా అనుకున్న లక్ష్యం కన్నా రెండింతలు ఎక్కువ అని తెలిపింది. తయారు చేయబడిన ఆక్సిజన్ 98 శాతం స్వచ్ఛంగా, మెరుగ్గా ఉన్నట్లు, ఇది శ్వాస, ఇంధన ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని నాసా ప్రకటించింది.
Also Read
- Iran Hit List: ఇరాన్ హిట్లిస్ట్లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
- Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
- US Iran Conflict: ఇరాన్పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్లలో పేలుళ్లు.. హార్ముజ్లో వాణిజ్య నౌకలపై కాల్పులు
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
Read Also: Rahul Gandhi: “ఉక్రెయిన్-రష్యా” వివాదంలో భారత్ వైఖరిపై రాహుల్ కీలక వ్యాఖ్యలు..
మార్స్ పై అత్యంత పలుచని వాతావరణం ఉంది. భూమి మొత్తం బంజేరుగా ఉంటుంది. ఇక్కడి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ లోని ప్రతీ అణువు నుంచి ఒక ఆక్సిజన్ అణువును వేరు చేయడానికి ఎలక్ట్రోకెమికల్ ప్రక్రియను ఉపయోగిస్తూ MOXIE అనే పరికరం పనిచేస్తుంది. ఉత్పత్తి చేసిన ఆక్సిజన్ స్వచ్ఛతను తెలుసుకునేందుకు ఆ వాయువును విశ్లేషిస్తుంటుంది. MOXIE సాధించిన విషయం భవిష్యత్తులో అంగారకుడిపై మానవ ఆవాసాల దిశగా ప్రోత్సహిస్తుంది.
సౌరకుటుంబంలో ఒక్క అంగారకుడు మాత్రమే భూమి లాగా ‘గోల్డెన్ లాక్ జోన్’లో ఉన్నాడు. అంటే సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రత ఎక్కువ కాకుండా మరీ తక్కవ కాకుండా ఉండే ప్రాంతం. కొన్ని బిలియన్ ఏళ్ల క్రితం అంగారకుడిపై ద్రవ స్థితిలో నీరు ఉండేదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. దీనికి అక్కడ ఉన్న లోయలు, ఎండి పోయిన నదీ ప్రవాహాల లాంటి గుర్తులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అయితే కాలక్రమంలో భూమిలాగా గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం, తగిన అయస్కాంత క్షేత్రం లేకపోవడంతో మార్స్ నీరును కోల్పోయిందనే వాదన ఉంది. నాసా ఇంతకుముందు క్యూరియాసిటీ, ఆపర్చునిటీ రోవర్లను అంగారకుడిపైకి పంపింది. ఇప్పుడు పంపిన పర్సెవరెన్స్ రోవర్ వీటన్నింటి కన్నా మోస్ట్ అడ్వాన్డుడ్ రోవర్.
తాజావార్తలు
-
Iran Hit List: ఇరాన్ హిట్లిస్ట్లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
-
God of War: పాపం త్రివిక్రమ్.. మళ్ళీ కథ మార్చాల్సిందేనా?
-
Naga Vamsi: పైరసీకి పక్కా ప్లాన్తో నాగ వంశీ చెక్.. ‘లెనిన్’ విషయంలో ఏం జరిగింది?
-
Tollywood : సింగిల్ థియేటర్స్ మూత పడడానికి స్టార్ హీరోలే కారణమా?
-
Balakrishna – Anil Ravipudi: మరోసారి బాలయ్యతో అనిల్ రావిపూడి.. ఫ్యాన్స్కు మాస్ ట్రీట్!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!