Osama bin Laden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం.. అమెరికాలో వైరల్ అవుతున్న ‘ఒసామా బిన్ లాడెన్’ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Osama bin Laden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ రాసిన లేఖ వైరల్ అవుతోంది. అమెరికాలో 2001లో 9/11 దాడులకు బిన్ లాడెన్ పాల్పడ్డాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై విమానాలతో దాడి చేసిన ఉగ్రఘటనలో మాస్టర్ మైండ్ ఒసామా బిన్ లాడెన్దే. ఆ సమయంలో అమెరికన్లను ఉద్దేశించి రాసిని లేఖ ఇప్పుడు ఆ దేశంలో టిక్ టాక్లో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన 21 ఏళ్ల తరువాత ఒసామా బిన్ లాడెన్ని అమెరికన్లు ఈ లేఖ ద్వారా మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
ఒసామాకు సంబంధించి లేఖను వీడియోల రూపంలో వేలాది మంది టిక్ టాక్ వినియోగదారులు షేర్ చేసుకుంటున్నారు. ‘TikTok PsyOp సునామీ’గా అక్కడి ప్రజలు దీన్ని పిలుస్తున్నారు. ఈ లేఖలో బిన్ లాడెన్ పాలస్తీనా పరిస్థితిని గురించి మాట్లాడాడు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ఈ లేఖకు ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
Read Also: Rashmika Deep Fake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఏమన్నాడంటే.. ?
9/11 దాడుల్ని సమర్థిస్తూ.. ‘‘మా పాలస్తీనాను ఆక్రమించి అణిచివేతకు పాల్పడుతున్న ఇజ్రయిల్కి అమెరికా మద్దతు ఇస్తుంది’’ అని లేఖలో ఆరోపించాడు. ‘‘పాలస్తీనా దశాబ్ధాలుగా ఆక్రమణలో ఉంది, సెప్టెంబర్ 11 తర్వాత మీ అధ్యక్షులు ఎవరూ కూడా దీని గురించి మాట్లాడలేదు. పాలస్తీనా బందీగా కనిపించదు, దాని సంకెళ్లు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తాము. అమెరికా క్రైస్తవుల రక్తంతో దాని దురహంకారానికి మూల్యం చెల్లించుకుంటుంది’’ అని అమెరికన్లకు ఒసామా బిన్ లాడెన్ లేఖ రాశాడు.
మే 2011లో పాకిస్తాన్ లోని అబోట్టాబాద్లోని ఒక భవనంలో ఒసామా బిన్ లాడెన్ని అమెరికా నేవీ సీల్స్ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా హతమార్చాయి. గార్డియన్ పత్రిక 2002 నుంచి ఒసామా బిన్ లాడెన్ లేఖను తన వెబ్సైట్ లో ఉందచింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో లేఖను తీసేసింది. ప్రస్తుతం ఇజ్రాయిల్-పాలస్తీనా సంక్షోభం నేపథ్యంలో ఈ లేఖ వైరల్ కావడం విశేషం.
అక్టోబర్7న గాజాలోని హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడులు చేసి 1400 మందిని హతమార్చడమే కాకుండా 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై దాడులు చేస్తోంది. తాజాగా గాజాపై పట్టుసాధించే ప్రయత్నంలో ఉంది. ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ దాడుల్లో 11 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!