Osama bin Laden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం.. అమెరికాలో వైరల్ అవుతున్న ‘ఒసామా బిన్ లాడెన్’ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Osama bin Laden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ రాసిన లేఖ వైరల్ అవుతోంది. అమెరికాలో 2001లో 9/11 దాడులకు బిన్ లాడెన్ పాల్పడ్డాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై విమానాలతో దాడి చేసిన ఉగ్రఘటనలో మాస్టర్ మైండ్ ఒసామా బిన్ లాడెన్దే. ఆ సమయంలో అమెరికన్లను ఉద్దేశించి రాసిని లేఖ ఇప్పుడు ఆ దేశంలో టిక్ టాక్లో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన 21 ఏళ్ల తరువాత ఒసామా బిన్ లాడెన్ని అమెరికన్లు ఈ లేఖ ద్వారా మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
ఒసామాకు సంబంధించి లేఖను వీడియోల రూపంలో వేలాది మంది టిక్ టాక్ వినియోగదారులు షేర్ చేసుకుంటున్నారు. ‘TikTok PsyOp సునామీ’గా అక్కడి ప్రజలు దీన్ని పిలుస్తున్నారు. ఈ లేఖలో బిన్ లాడెన్ పాలస్తీనా పరిస్థితిని గురించి మాట్లాడాడు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ఈ లేఖకు ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read
- Pakistan: ‘‘దౌత్యం కడుపు నింపదు’’.. పాక్ పరువు తీసిన సింగపూర్ దౌత్యవేత్త..
- Ayatollah Khamenei: చనిపోయిన 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉంచారు.?
- Pakistan: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
- Ford: రూ.186 విలువ చేసే కుకీ దొంగిలించాడని ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్.. చివరికి
Read Also: Rashmika Deep Fake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఏమన్నాడంటే.. ?
9/11 దాడుల్ని సమర్థిస్తూ.. ‘‘మా పాలస్తీనాను ఆక్రమించి అణిచివేతకు పాల్పడుతున్న ఇజ్రయిల్కి అమెరికా మద్దతు ఇస్తుంది’’ అని లేఖలో ఆరోపించాడు. ‘‘పాలస్తీనా దశాబ్ధాలుగా ఆక్రమణలో ఉంది, సెప్టెంబర్ 11 తర్వాత మీ అధ్యక్షులు ఎవరూ కూడా దీని గురించి మాట్లాడలేదు. పాలస్తీనా బందీగా కనిపించదు, దాని సంకెళ్లు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తాము. అమెరికా క్రైస్తవుల రక్తంతో దాని దురహంకారానికి మూల్యం చెల్లించుకుంటుంది’’ అని అమెరికన్లకు ఒసామా బిన్ లాడెన్ లేఖ రాశాడు.
మే 2011లో పాకిస్తాన్ లోని అబోట్టాబాద్లోని ఒక భవనంలో ఒసామా బిన్ లాడెన్ని అమెరికా నేవీ సీల్స్ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా హతమార్చాయి. గార్డియన్ పత్రిక 2002 నుంచి ఒసామా బిన్ లాడెన్ లేఖను తన వెబ్సైట్ లో ఉందచింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో లేఖను తీసేసింది. ప్రస్తుతం ఇజ్రాయిల్-పాలస్తీనా సంక్షోభం నేపథ్యంలో ఈ లేఖ వైరల్ కావడం విశేషం.
అక్టోబర్7న గాజాలోని హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడులు చేసి 1400 మందిని హతమార్చడమే కాకుండా 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై దాడులు చేస్తోంది. తాజాగా గాజాపై పట్టుసాధించే ప్రయత్నంలో ఉంది. ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ దాడుల్లో 11 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
YS Jagan Mohan Reddy: స్టీల్ ప్లాంట్ పనులు మొదలు.. X వేదికగా జగన్ కీలక వ్యాఖ్యలు.!
-
Mulugu : ప్రాణాలతో చెలగాటం.. వర్షాకాలంలో వాగు దాటేందుకు ఆదివాసీల అవస్థలు.!
-
Cristiano Ronaldo: పెనాల్టీకి ముందు ‘బిస్మిల్లా’ అన్నాడా? వీడియో వైరల్.. అసలు ఏం జరిగింది?
-
Ketan Agarwal Murder Case: సియా, చేతన్ల ఫోన్లలో కోడ్ వర్డ్స్..
-
Defence: రక్షణ శాఖ మరింత బలోపేతం.. అత్యాధునిక ఆయుధాలు కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!