North Korea: యుద్ధానికి సిద్ధమవుతున్న ఉత్తర కొరియా.. సైనిక జనరల్గా కొత్త వ్యక్తి నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: ఉత్తర కొరియా తన పక్కనున్న దేశంతో యుద్ధానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా గురువారం సెంట్రల్ మిటలరీ కమిషన్ సమావేశాన్ని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న సైనిక జనరల్ను తొలగించి ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియామించారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియా సరి కొత్త ఆయుధాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టడంతోపాటు, దళాలను సిద్ధం చేయాలని కిమ్ సైన్యాన్ని ఆదేశించినట్లు ఆదేశ మీడియా సంస్థ ప్రకటించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తున్నట్లు ఆ దేశ వార్తా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఓ కీలక సైనిక జనరల్ను తొలగించి ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించినట్లు వెల్లడించింది. ఆయుధాల ఉత్పత్తిని పెంచాలని, సైనిక సన్నాహాలను వేగవంతం చేయాలని సూచించినట్లు తెలిపింది. శత్రువులపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని సైనికాధికారులను ఆదేశించినట్లు ప్రకటించింది.
Read also: Russia: ఇస్రోతో రోస్కోస్మోస్ పోటీ.. చంద్రయాన్కు పోటీగా రష్యా లూనా-25
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
ఉత్తర కొరియా సైనిక జనరల్గా ఉన్న పాక్-సు-ఇల్ స్థానంలో కొత్త జనరల్గా రి యాంగ్ గిల్ను నియమిస్తున్నట్లు కిమ్ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికా, దక్షిణ కొరియా చేపట్టబోయే సంయుక్త సైనిక విన్యాసాలపై కిమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియాలో తయారైన కొత్త ఆయుధాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టాలని, సైనిక దళాలను సిద్ధం చేయాలని సైన్యాన్ని కిమ్ జోంగ్ ఆదేశించినట్లు తెలిపింది. గతవారమే ఆయుధ కర్మాగారాలను సందర్శించిన కిమ్.. క్రూజ్ క్షిపణి ఇంజిన్లు, మానవరహిత గగనతల వాహనాల (UAV) నిర్మాణలను త్వరితం చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ దాడులకు ఉపయోగించే రాకెట్లను, కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణినీ కిమ్ పరిశీలించారు. వాటితోపాటు ఆయుధ కర్మాగారాల్లో రైఫిళ్ల పనితీరును కిమ్ స్వయంగా పరిశీలించిన ఫొటోలను ఆ దేశ మీడియా బయటికి విడుదల చేసింది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!