North Korea: యుద్ధానికి సిద్ధమవుతున్న ఉత్తర కొరియా.. సైనిక జనరల్గా కొత్త వ్యక్తి నియామకం
North Korea: ఉత్తర కొరియా తన పక్కనున్న దేశంతో యుద్ధానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా గురువారం సెంట్రల్ మిటలరీ కమిషన్ సమావేశాన్ని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న సైనిక జనరల్ను తొలగించి ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియామించారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియా సరి కొత్త ఆయుధాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టడంతోపాటు, దళాలను సిద్ధం చేయాలని కిమ్ సైన్యాన్ని ఆదేశించినట్లు ఆదేశ మీడియా సంస్థ ప్రకటించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తున్నట్లు ఆ దేశ వార్తా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఓ కీలక సైనిక జనరల్ను తొలగించి ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించినట్లు వెల్లడించింది. ఆయుధాల ఉత్పత్తిని పెంచాలని, సైనిక సన్నాహాలను వేగవంతం చేయాలని సూచించినట్లు తెలిపింది. శత్రువులపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని సైనికాధికారులను ఆదేశించినట్లు ప్రకటించింది.
Read also: Russia: ఇస్రోతో రోస్కోస్మోస్ పోటీ.. చంద్రయాన్కు పోటీగా రష్యా లూనా-25
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ఉత్తర కొరియా సైనిక జనరల్గా ఉన్న పాక్-సు-ఇల్ స్థానంలో కొత్త జనరల్గా రి యాంగ్ గిల్ను నియమిస్తున్నట్లు కిమ్ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికా, దక్షిణ కొరియా చేపట్టబోయే సంయుక్త సైనిక విన్యాసాలపై కిమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియాలో తయారైన కొత్త ఆయుధాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టాలని, సైనిక దళాలను సిద్ధం చేయాలని సైన్యాన్ని కిమ్ జోంగ్ ఆదేశించినట్లు తెలిపింది. గతవారమే ఆయుధ కర్మాగారాలను సందర్శించిన కిమ్.. క్రూజ్ క్షిపణి ఇంజిన్లు, మానవరహిత గగనతల వాహనాల (UAV) నిర్మాణలను త్వరితం చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ దాడులకు ఉపయోగించే రాకెట్లను, కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణినీ కిమ్ పరిశీలించారు. వాటితోపాటు ఆయుధ కర్మాగారాల్లో రైఫిళ్ల పనితీరును కిమ్ స్వయంగా పరిశీలించిన ఫొటోలను ఆ దేశ మీడియా బయటికి విడుదల చేసింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!