Nirav Modi: నీరవ్ మోడీకి మళ్లీ చుక్కెదురు.. బెయిల్ తిరస్కరించిన లండన్ కోర్టు
- నీరవ్ మోడీకి మళ్లీ చుక్కెదురు
- బెయిల్ పిటిషన్ తిరస్కరించిన లండన్ కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక నేరస్థుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్ను లండన్ కోర్టు మళ్లీ తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారత మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన నీరవ్ మోడీ 2019 మార్చి నుంచి యూకే జైల్లో ఉన్నాడు. అతని బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురి కావడం ఇది పదోసారి కావడం విశేషం. తాజా బెయిల్ పిటిషన్ను లండన్లోని కింగ్స్ బెంచ్ డివిజన్ హైకోర్టు తిరస్కరించిందని సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. లండన్కు వెళ్లిన సీబీఐ బృందం.. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ సహాయంతో బెయిల్ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించిందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని.. భారత ప్రభుత్వం నుంచి ప్రాణాలకు ముప్పు ఉందని.. అందుకే పారిపోయినట్లు నీరవ్ మోడీ పిటిషన్లో పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: IPL 2025: ప్లేఆఫ్స్కు బట్లర్ దూరం.. మయాంక్కు మళ్లీ గాయం!
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
ఇదిలా ఉంటే 2022లో నీరవ్ మోడీని భారత్కు అప్పగించేందుకు యూకే హైకోర్టు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను నీరవ్ మోడీ రూ.13,000 కోట్లకు మోసం చేశాడు. అందులో రూ.6498.20 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక కుంభకోణం బయటపడటానికి కొన్ని వారాల ముందు నీరవ్ మోడీ 2018, జనవరిలో భారత్ నుంచి లండన్కు పారిపోయాడు. నీరవ్ మోడీతో పాటు పారిపోయిన అతని మామ మెహుల్ చోక్సీని గత నెలలో బెల్జియంలో అరెస్టు చేశారు. చోక్సీ కూడా తాను ఎటువంటి తప్పు చేయలేదని వ్యాఖ్యానించాడు. నీరవ్ మోడీపై మూడు సెట్ల క్రిమినల్ కేసులు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసం చేసినందుకు సీబీఐ కేసు, మనీలాండరింగ్లో ఈడీ కేసు ఉంది. ఇక సీబీఐ విచారణలో ఆధారాలు, సాక్షులతో జోక్యం చేసుకున్నందుకు మూడో కేసు ఉంది.
ఇది కూడా చదవండి: Israel-Hamas: గాజాలో ఇజ్రాయెల్ బాంబుల మోత.. 80 మంది పౌరులు మృతి..!
గతేడాది డిసెంబర్లో రూ.1,052.58 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం మరియు ప్రైవేటు బ్యాంక్లకు నీరవ్ మోడీ అప్పగించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2024, సెప్టెంబర్లో నీరవ్ మోడీ కంపెనీలకు సంబంధించి రూ.29.75 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈ అటాచ్డ్ ఆస్తుల్లో స్థిరాస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి. ఇక విదేశాల్లో రూ.2,596 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేయబడ్డాయి. 2018లో ముంబైలో రూ.692.90 కోట్లు జప్తు చేయబడ్డాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఆస్తులు అటాచ్ చేయబడ్డాయి.
Nirav Modi's bail petition rejected in London.
Source: Central Bureau of Investigation (CBI) pic.twitter.com/9Zw5b1AUau
— ANI (@ANI) May 15, 2025
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!