Nirav Modi: నీరవ్ మోడీకి మళ్లీ చుక్కెదురు.. బెయిల్ తిరస్కరించిన లండన్ కోర్టు
- నీరవ్ మోడీకి మళ్లీ చుక్కెదురు
- బెయిల్ పిటిషన్ తిరస్కరించిన లండన్ కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక నేరస్థుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్ను లండన్ కోర్టు మళ్లీ తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారత మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన నీరవ్ మోడీ 2019 మార్చి నుంచి యూకే జైల్లో ఉన్నాడు. అతని బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురి కావడం ఇది పదోసారి కావడం విశేషం. తాజా బెయిల్ పిటిషన్ను లండన్లోని కింగ్స్ బెంచ్ డివిజన్ హైకోర్టు తిరస్కరించిందని సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. లండన్కు వెళ్లిన సీబీఐ బృందం.. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ సహాయంతో బెయిల్ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించిందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని.. భారత ప్రభుత్వం నుంచి ప్రాణాలకు ముప్పు ఉందని.. అందుకే పారిపోయినట్లు నీరవ్ మోడీ పిటిషన్లో పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: IPL 2025: ప్లేఆఫ్స్కు బట్లర్ దూరం.. మయాంక్కు మళ్లీ గాయం!
Also Read
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
ఇదిలా ఉంటే 2022లో నీరవ్ మోడీని భారత్కు అప్పగించేందుకు యూకే హైకోర్టు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను నీరవ్ మోడీ రూ.13,000 కోట్లకు మోసం చేశాడు. అందులో రూ.6498.20 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక కుంభకోణం బయటపడటానికి కొన్ని వారాల ముందు నీరవ్ మోడీ 2018, జనవరిలో భారత్ నుంచి లండన్కు పారిపోయాడు. నీరవ్ మోడీతో పాటు పారిపోయిన అతని మామ మెహుల్ చోక్సీని గత నెలలో బెల్జియంలో అరెస్టు చేశారు. చోక్సీ కూడా తాను ఎటువంటి తప్పు చేయలేదని వ్యాఖ్యానించాడు. నీరవ్ మోడీపై మూడు సెట్ల క్రిమినల్ కేసులు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసం చేసినందుకు సీబీఐ కేసు, మనీలాండరింగ్లో ఈడీ కేసు ఉంది. ఇక సీబీఐ విచారణలో ఆధారాలు, సాక్షులతో జోక్యం చేసుకున్నందుకు మూడో కేసు ఉంది.
ఇది కూడా చదవండి: Israel-Hamas: గాజాలో ఇజ్రాయెల్ బాంబుల మోత.. 80 మంది పౌరులు మృతి..!
గతేడాది డిసెంబర్లో రూ.1,052.58 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం మరియు ప్రైవేటు బ్యాంక్లకు నీరవ్ మోడీ అప్పగించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2024, సెప్టెంబర్లో నీరవ్ మోడీ కంపెనీలకు సంబంధించి రూ.29.75 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈ అటాచ్డ్ ఆస్తుల్లో స్థిరాస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి. ఇక విదేశాల్లో రూ.2,596 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేయబడ్డాయి. 2018లో ముంబైలో రూ.692.90 కోట్లు జప్తు చేయబడ్డాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఆస్తులు అటాచ్ చేయబడ్డాయి.
Nirav Modi's bail petition rejected in London.
Source: Central Bureau of Investigation (CBI) pic.twitter.com/9Zw5b1AUau
— ANI (@ANI) May 15, 2025
తాజావార్తలు
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
-
Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!