Nirav Modi: నీరవ్ మోడీకి మళ్లీ చుక్కెదురు.. బెయిల్ తిరస్కరించిన లండన్ కోర్టు
- నీరవ్ మోడీకి మళ్లీ చుక్కెదురు
- బెయిల్ పిటిషన్ తిరస్కరించిన లండన్ కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక నేరస్థుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్ను లండన్ కోర్టు మళ్లీ తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారత మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన నీరవ్ మోడీ 2019 మార్చి నుంచి యూకే జైల్లో ఉన్నాడు. అతని బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురి కావడం ఇది పదోసారి కావడం విశేషం. తాజా బెయిల్ పిటిషన్ను లండన్లోని కింగ్స్ బెంచ్ డివిజన్ హైకోర్టు తిరస్కరించిందని సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. లండన్కు వెళ్లిన సీబీఐ బృందం.. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ సహాయంతో బెయిల్ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించిందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని.. భారత ప్రభుత్వం నుంచి ప్రాణాలకు ముప్పు ఉందని.. అందుకే పారిపోయినట్లు నీరవ్ మోడీ పిటిషన్లో పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: IPL 2025: ప్లేఆఫ్స్కు బట్లర్ దూరం.. మయాంక్కు మళ్లీ గాయం!
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
ఇదిలా ఉంటే 2022లో నీరవ్ మోడీని భారత్కు అప్పగించేందుకు యూకే హైకోర్టు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను నీరవ్ మోడీ రూ.13,000 కోట్లకు మోసం చేశాడు. అందులో రూ.6498.20 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక కుంభకోణం బయటపడటానికి కొన్ని వారాల ముందు నీరవ్ మోడీ 2018, జనవరిలో భారత్ నుంచి లండన్కు పారిపోయాడు. నీరవ్ మోడీతో పాటు పారిపోయిన అతని మామ మెహుల్ చోక్సీని గత నెలలో బెల్జియంలో అరెస్టు చేశారు. చోక్సీ కూడా తాను ఎటువంటి తప్పు చేయలేదని వ్యాఖ్యానించాడు. నీరవ్ మోడీపై మూడు సెట్ల క్రిమినల్ కేసులు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసం చేసినందుకు సీబీఐ కేసు, మనీలాండరింగ్లో ఈడీ కేసు ఉంది. ఇక సీబీఐ విచారణలో ఆధారాలు, సాక్షులతో జోక్యం చేసుకున్నందుకు మూడో కేసు ఉంది.
ఇది కూడా చదవండి: Israel-Hamas: గాజాలో ఇజ్రాయెల్ బాంబుల మోత.. 80 మంది పౌరులు మృతి..!
గతేడాది డిసెంబర్లో రూ.1,052.58 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం మరియు ప్రైవేటు బ్యాంక్లకు నీరవ్ మోడీ అప్పగించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2024, సెప్టెంబర్లో నీరవ్ మోడీ కంపెనీలకు సంబంధించి రూ.29.75 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈ అటాచ్డ్ ఆస్తుల్లో స్థిరాస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి. ఇక విదేశాల్లో రూ.2,596 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేయబడ్డాయి. 2018లో ముంబైలో రూ.692.90 కోట్లు జప్తు చేయబడ్డాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఆస్తులు అటాచ్ చేయబడ్డాయి.
Nirav Modi's bail petition rejected in London.
Source: Central Bureau of Investigation (CBI) pic.twitter.com/9Zw5b1AUau
— ANI (@ANI) May 15, 2025
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!