Shehbaz Sharif: దీపావళి శుభాకాంక్షలపై ఆగ్రహావేశాలు.. పాక్ ప్రధానిపై నెటిజన్ల మండిపాటు
- దీపావళి శుభాకాంక్షలపై ఆగ్రహావేశాలు
- పాక్ ప్రధానిపై నెటిజన్ల మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పురస్కరించుకుని హిందువులకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్ట్పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అసలు పాకిస్థాన్లో హిందువులు ఎవరైనా మిగిలి ఉన్నారా? అంటూ నెటిజన్లు నిలదీశారు. పాకిస్థాన్లో హిందువులు హింసను ఎదుర్కొంటుంటే షెహబాజ్ షరీఫ్ పెట్టిన సందేశానికి ఏమైనా అర్థం ఉందా? అంటూ ఇంకొకరు ప్రశ్నించారు. ఇలా రకరకాలుగా పాకిస్థాన్ ప్రధానిని నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు.
ఇది కూడా చదవండి: Trump: శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే హమాస్ను పూర్తిగా నిర్మూలిస్తాం.. ట్రంప్ హెచ్చరిక
Also Read
- Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. 15 మంది మృతి
- 1991 Hijack: విమానం హైజాక్ జరిగితే, నిద్ర పోయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని భుట్టో..
- Pakistan: ‘‘దౌత్యం కడుపు నింపదు’’.. పాక్ పరువు తీసిన సింగపూర్ దౌత్యవేత్త..
- Ayatollah Khamenei: చనిపోయిన 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉంచారు.?
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హిందూ సమాజాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ పండుగ చీకటిపై వెలుగును.. చెడుపై మంచిని సూచిస్తుందని పేర్కొన్నారు. ‘‘దీపావళి వెలుగుతో ఇళ్లు, హృదయాలు ప్రకాశింపజేసినట్లుగా ఈ పండుగ చీకటిని పారద్రోలి.. సామరస్యాన్ని పెంపొందిస్తుంది. శాంతి, కరుణ, భాగస్వామ్య శ్రేయస్సు, భవిష్యత్ వైపు మనందరినీ నడిపించాలి.’’ అంటూ రాసుకొచ్చారు.
‘‘చీకటిపై వెలుగును.. చెడుపై మంచిని.. నిరాశపై ఆశను ప్రతిబింబించే దీపావళి స్ఫూర్తి. అసహనం నుంచి అసమానత వరకు మన సమాజాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలనే మన సమిష్టి సంకల్పానికి స్ఫూర్తినిస్తుంది.’’ అని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Diwali Child Safety Tips: దీపావళి వేడుకల్లో పిల్లలు భద్రం.. బాంబుల శబ్దాలతో ప్రమాదం ఎంత?
అయితే షరీఫ్ పోస్ట్ చేయగానే నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందువులు హింసను ఎదుర్కొంటున్న దేశంలో ప్రధాని సందేశానికి ఏమైనా అర్థం ఉందా? అంటూ నెటిజన్లు నిలదీశారు. ఒక నెటిజన్ అయితే ఎగతాళి చేస్తూ ‘‘పాకిస్థాన్లో హిందువులు ఎవరైనా మిగిలి ఉన్నారా?.’’ అంటూ నిలదీశాడు.
ఇది వంచన కాదా? అంటూ మరొకరు నిలదీశారు. పాకిస్థాన్ ప్రభుత్వం మైనారిటీలపై క్రమబద్ధమైన వివక్షను ప్రదర్శిస్తోందని ఆరోపించారు. బలవంతపు మతమార్పిడులు, దేవాలయాలపై దాడుల సంఘటనలను గుర్తుచేశారు. ‘‘పహల్గామ్లో హిందువులను చంపిన తర్వాత దీపావళికి శుభాకాంక్షలు చెప్పడమేంటి?. సిగ్గులేని పాకిస్థాన్. హిందువులు, క్రైస్తవులు, సిక్కులను క్రమబద్ధంగా చంపి మతం మార్చారు… ప్రపంచంలోనే ఉగ్రవాద దేశం”. అంటూ ఇంకొకరు ధ్వజమెత్తారు.
On the auspicious occasion of Diwali, I extend my heartfelt greetings to our Hindu community in Pakistan and around the world.
As homes and hearts are illuminated with the light of Diwali, may this festival dispel darkness, foster harmony, and guide us all toward a future of…
— Shehbaz Sharif (@CMShehbaz) October 20, 2025
Are there any Hindus left in Pakistan ?
— Ashley (Molly) (@theAshleyMolly) October 20, 2025
తాజావార్తలు
-
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. 15 మంది మృతి
-
CM Chandrababu Naidu: ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించిన సీఎం.!
-
CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
-
Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
-
India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!