Shehbaz Sharif: దీపావళి శుభాకాంక్షలపై ఆగ్రహావేశాలు.. పాక్ ప్రధానిపై నెటిజన్ల మండిపాటు
- దీపావళి శుభాకాంక్షలపై ఆగ్రహావేశాలు
- పాక్ ప్రధానిపై నెటిజన్ల మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పురస్కరించుకుని హిందువులకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్ట్పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అసలు పాకిస్థాన్లో హిందువులు ఎవరైనా మిగిలి ఉన్నారా? అంటూ నెటిజన్లు నిలదీశారు. పాకిస్థాన్లో హిందువులు హింసను ఎదుర్కొంటుంటే షెహబాజ్ షరీఫ్ పెట్టిన సందేశానికి ఏమైనా అర్థం ఉందా? అంటూ ఇంకొకరు ప్రశ్నించారు. ఇలా రకరకాలుగా పాకిస్థాన్ ప్రధానిని నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు.
ఇది కూడా చదవండి: Trump: శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే హమాస్ను పూర్తిగా నిర్మూలిస్తాం.. ట్రంప్ హెచ్చరిక
Also Read
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హిందూ సమాజాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ పండుగ చీకటిపై వెలుగును.. చెడుపై మంచిని సూచిస్తుందని పేర్కొన్నారు. ‘‘దీపావళి వెలుగుతో ఇళ్లు, హృదయాలు ప్రకాశింపజేసినట్లుగా ఈ పండుగ చీకటిని పారద్రోలి.. సామరస్యాన్ని పెంపొందిస్తుంది. శాంతి, కరుణ, భాగస్వామ్య శ్రేయస్సు, భవిష్యత్ వైపు మనందరినీ నడిపించాలి.’’ అంటూ రాసుకొచ్చారు.
‘‘చీకటిపై వెలుగును.. చెడుపై మంచిని.. నిరాశపై ఆశను ప్రతిబింబించే దీపావళి స్ఫూర్తి. అసహనం నుంచి అసమానత వరకు మన సమాజాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలనే మన సమిష్టి సంకల్పానికి స్ఫూర్తినిస్తుంది.’’ అని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Diwali Child Safety Tips: దీపావళి వేడుకల్లో పిల్లలు భద్రం.. బాంబుల శబ్దాలతో ప్రమాదం ఎంత?
అయితే షరీఫ్ పోస్ట్ చేయగానే నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందువులు హింసను ఎదుర్కొంటున్న దేశంలో ప్రధాని సందేశానికి ఏమైనా అర్థం ఉందా? అంటూ నెటిజన్లు నిలదీశారు. ఒక నెటిజన్ అయితే ఎగతాళి చేస్తూ ‘‘పాకిస్థాన్లో హిందువులు ఎవరైనా మిగిలి ఉన్నారా?.’’ అంటూ నిలదీశాడు.
ఇది వంచన కాదా? అంటూ మరొకరు నిలదీశారు. పాకిస్థాన్ ప్రభుత్వం మైనారిటీలపై క్రమబద్ధమైన వివక్షను ప్రదర్శిస్తోందని ఆరోపించారు. బలవంతపు మతమార్పిడులు, దేవాలయాలపై దాడుల సంఘటనలను గుర్తుచేశారు. ‘‘పహల్గామ్లో హిందువులను చంపిన తర్వాత దీపావళికి శుభాకాంక్షలు చెప్పడమేంటి?. సిగ్గులేని పాకిస్థాన్. హిందువులు, క్రైస్తవులు, సిక్కులను క్రమబద్ధంగా చంపి మతం మార్చారు… ప్రపంచంలోనే ఉగ్రవాద దేశం”. అంటూ ఇంకొకరు ధ్వజమెత్తారు.
On the auspicious occasion of Diwali, I extend my heartfelt greetings to our Hindu community in Pakistan and around the world.
As homes and hearts are illuminated with the light of Diwali, may this festival dispel darkness, foster harmony, and guide us all toward a future of…
— Shehbaz Sharif (@CMShehbaz) October 20, 2025
Are there any Hindus left in Pakistan ?
— Ashley (Molly) (@theAshleyMolly) October 20, 2025
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!