Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- బంగ్లాదేశ్కు కరెంట్ షాక్..
- జార్ఖండ్ అదానీ ప్లాంట్లో యూనిట్ ట్రిప్..
- ఉద్రిక్తతల సమయంలో బంగ్లాలో కరెంట్ కష్టాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో విద్యుత్ సంక్షోభం ముదిరింది. జార్ఖండ్ రాష్ట్రంలోని అదానీ పవర్కు చెందిన గొడ్డా థర్మల్ పవర్ ప్లాంట్లోని రెండు యూనిట్లలో ఒక దానిలో బాయిలర్ సమస్య ఏర్పడింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ పవర్ ప్లాంట్లో ప్రస్తుతం ఉత్పత్తి సగానికి పడిపోయింది. బంగ్లాదేశ్తో దీర్ఘకాలిక ఒప్పందంలో భాగంగా దాదాపు 1500 మెగావాట్ల విద్యుత్ ఈ ప్లాంట్ నుంచే సరఫరా అవుతోంది. ఈ పరిణామాలు బంగ్లాదేశ్లో విద్యుత్ సమస్యల్ని మరింతగా పెంచనుంది. సరఫరా పూర్తిగా పునరుద్ధరించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.
గత కొంత కాలంగా బొగ్గు రవాణా సమస్యల కారణంగా ఈ ప్లాంట్ తక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ సమస్య పరిష్కారమవుతుందని అనుకుంటున్న సమయంలో ఒక యూనిట్ ట్రిప్ కావడం బంగ్లాదేశ్కు కరెంట్ షాక్గా చెప్పొచ్చు. బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు అధికారుల ప్రకారం.. మరమ్మతు పనులు ప్రారంభించడానికి కనీసం 48 గంటల పట్టొచ్చు. ఆ తర్వాత విద్యుత్ పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.
Also Read
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
- BRICS: బ్రిక్స్లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
భారత్తో ఉద్రిక్తతల వేళ బంగ్లాకు కరెంట్ షాక్..
షేక్ హసీనా విషయంలో బంగ్లాదేశ్ భారత్ను హెచ్చరించే స్థాయికి వచ్చింది. 2024 ఆగస్టులో హింసాత్మక అల్లర్ల సమయంలో హసీనా బంగ్లా నుంచి భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ అల్లర్లలో మానవత్వానికి వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్ కోర్టు హసీనాకు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆమెను అప్పగించాలని ఆ దేశం డిమాండ్ చేస్తోంది. ఈ అంశం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది.
బంగ్లా ప్రధాని తారిఖ్ రెహ్మాన్ భారత పర్యటనకు రాకుండా చైనా పర్యటనకు వెళ్లారు. బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానం అందినా కూడా వింత కారణాలు చెబుతూ తారిఖ్ రెహ్మాన్ ఈ సమావేశాలకు రాలేదు. బిమ్స్టెక్ చైర్మన్ హోదాలో ఆహ్వానం అందిందని, బంగ్లా ప్రధాని హోదాలో ఆహ్వానం పంపలేదని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ చెప్పారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
-
Harish Rao : మంత్రి పొంగులేటివన్నీ అబద్ధాల ప్రవాహాలే
-
Off The Record : ఏపీ కూటమిలో సీట్ల సంకటం! టీడీపీకి షాక్ ఇస్తున్న జనసేన, బీజేపీ?
-
Off The Record : కొండా సురేఖ సైలెంట్ ఎందుకు? అసెంబ్లీకి దూరం వెనుక అసలు వ్యూహమేంటి?
-
TATA Group: టాటా సన్స్కు ఆర్బీఐ ఊహించని షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!