అమెరికాలోని లాస్ ఎంజెలిస్లో ఓ వ్యక్తి అర్ధరాత్రి అలజడి సృష్టించాడు. దాదాపుగా నగ్నంగా ఉన్న ఓ వ్యక్తి బోయిల్ హైట్ ఏరియాలోని సెయింట్ మేరీ క్యాథలిక్ చర్చిపైకి ఎక్కి శిలువకు నిప్పు అంటించాడు. ఆ తరువాత అక్కడి నుంచి మరో బిల్డింగ్పైకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చర్చి శిలువకు నిప్పు అంటించినప్పటికీ ఆ మంటలు పెద్దగా అంటుకొకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే,అర్ధరాత్రి సమయంలో ఆ వ్యక్తి ఎందుకు అలా చేశాడు, కారణాలు ఎంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.