Modi-Putin: మోడీ-పుతిన్ సంభాషణపై నాటో చీఫ్ కీలక వ్యాఖ్యలు
- మోడీ-పుతిన్ సంభాషణపై నాటో చీఫ్ కీలక వ్యాఖ్యలు
- భవిష్యత్ వ్యూహాల గురించి చర్చించుకుంటున్నారన్న మార్క్ రుట్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ-పుతిన్ సంబంధాలపై నాటో చీఫ్ మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో ఎలా ముందుకెళ్తున్నారన్న విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ను ప్రధాని మోడీ ఆరా తీసినట్లు నాటో చీఫ్ పేర్కొన్నారు. భారత్పై సుంకాల భారం పడటంతో పుతిన్ భవిష్యత్ వ్యూహాల గురించి మోడీ అడిగి తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు. న్యూయార్క్ పర్యటనలో మార్క్ రుట్టే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Netanyahu: అరెస్ట్ భయంతో నెతన్యాహు అమెరికాకు ఎలా వెళ్లారంటే..!
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు భారత్పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. దీంతో అత్యధిక సుంకం భరిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. అయితే సుంకాలు కారణంగా పుతిన్తో మోడీ చర్చలు జరుపుతున్నారని.. భవిష్యత్ వ్యూహాన్ని వివరించాలని పుతిన్ను మోడీ అడిగినట్లుగా మార్క్ రుట్టే చెప్పుకొచ్చారు. అయితే రుట్టే వ్యాఖ్యలపై ఇప్పటి వరకు భారత్ గానీ.. రష్యా గానీ స్పందించలేదు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం ధరలు ఇలా..!
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పుతిన్ అంగీకరించలేదు. దీంతో రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడం వల్లే పుతిన్ శాంతి ఒప్పందానికి రావడం లేదని ఆరోపించారు. దీంతో భారత్పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు.
ప్రస్తుతం అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. అలాగే త్వరలో మోడీ-ట్రంప్ మధ్య కూడా కీలక సమావేశం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశం తర్వాత చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల సెప్టెంబర్ 16న ట్రంప్.. మోడీకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. భారత్, మోడీ మంచి మిత్రులు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
-
Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..