Modi-Putin: మోడీ-పుతిన్ సంభాషణపై నాటో చీఫ్ కీలక వ్యాఖ్యలు
- మోడీ-పుతిన్ సంభాషణపై నాటో చీఫ్ కీలక వ్యాఖ్యలు
- భవిష్యత్ వ్యూహాల గురించి చర్చించుకుంటున్నారన్న మార్క్ రుట్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ-పుతిన్ సంబంధాలపై నాటో చీఫ్ మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో ఎలా ముందుకెళ్తున్నారన్న విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ను ప్రధాని మోడీ ఆరా తీసినట్లు నాటో చీఫ్ పేర్కొన్నారు. భారత్పై సుంకాల భారం పడటంతో పుతిన్ భవిష్యత్ వ్యూహాల గురించి మోడీ అడిగి తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు. న్యూయార్క్ పర్యటనలో మార్క్ రుట్టే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Netanyahu: అరెస్ట్ భయంతో నెతన్యాహు అమెరికాకు ఎలా వెళ్లారంటే..!
Also Read
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
- Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు భారత్పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. దీంతో అత్యధిక సుంకం భరిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. అయితే సుంకాలు కారణంగా పుతిన్తో మోడీ చర్చలు జరుపుతున్నారని.. భవిష్యత్ వ్యూహాన్ని వివరించాలని పుతిన్ను మోడీ అడిగినట్లుగా మార్క్ రుట్టే చెప్పుకొచ్చారు. అయితే రుట్టే వ్యాఖ్యలపై ఇప్పటి వరకు భారత్ గానీ.. రష్యా గానీ స్పందించలేదు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం ధరలు ఇలా..!
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పుతిన్ అంగీకరించలేదు. దీంతో రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడం వల్లే పుతిన్ శాంతి ఒప్పందానికి రావడం లేదని ఆరోపించారు. దీంతో భారత్పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు.
ప్రస్తుతం అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. అలాగే త్వరలో మోడీ-ట్రంప్ మధ్య కూడా కీలక సమావేశం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశం తర్వాత చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల సెప్టెంబర్ 16న ట్రంప్.. మోడీకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. భారత్, మోడీ మంచి మిత్రులు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!