భూమిపై కాకుండా విశ్వంలో మరో గ్రహంపై మానవ మనుగడ సాధ్యం అవుతుందా? లేదా అనే విషయాలపై అమెరికాకు చెందిన నాసా సంస్థ అనేక పరిశోధనలు చేస్తున్నది. అయితే, ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంగారక గ్రహంపై ఇప్పటికే నాసా పరిశోధన చేస్తున్నది. సౌరకుటుంబంలోని శని గ్రహానికి చెందిన చంద్రునిపై జీవం ఉండేందుకు అవకాశం ఉన్నట్టుగా నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.
Read: వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్లో ప్రియాంక చోప్రా… పిక్స్ వైరల్
శనిగ్రహానికి చెందిన చంద్రుడు ఎన్సెలాడ్ పై పెద్దమొత్తంలో మీథేన్ నిల్వలు ఉన్నాయి. అంతేకాదు ఆ చంద్రునిపై కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉన్నట్టు శాస్తవేత్తలు గుర్తించారు. కార్బన్డైఆక్సైడ్ ను తీసుకొని సూక్ష్మజీవులు మీథేన్ను విడుదల చేస్తాయి. మీథేన్ ఉన్నది అంటే అక్కడ జీవం ఉంటుందనే నిర్ధారణకు వచ్చారు నాసా పరిశోధకులు. ఈ చంద్రుడి ఉపరితలం మంచుతో కప్పబడి ఉందని, ఈ మంచు అడుగున మహాసముద్రం ఉండే అవకాశం లేకపోలేదని నాసా పరిశోధకులు చెబుతున్నారు.