Artemis 2: చంద్రుడి పైకి వెళ్లబోయేది వీరే.. పేర్లు వెల్లడించిన నాసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Artemis 2:అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్టెమిస్ 2 మూన్ మిషన్ చేపట్టబోతోంది. దాదాపుగా 50 ఏళ్ల తరువాత తొలిసారిగా మానవుడు మరోసారి చంద్రుడి వద్దకు వెళ్లబోతున్నాడు. తాజాగా సోమవారం ఈ మూన్ మిషన్ కు సంబంధించి వ్యోమగాముల పేర్లను వెల్లడించింది నాసా. నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశారు. ఆర్టెమిస్ 2 వ్యోమనౌక ద్వారా జెరెమీ హాన్సెస్, రీడ్ వైజ్ మన్, క్రిస్టినా కోచ్, విక్టర్ గ్లోవర్ లు చంద్రుడి పైకి వెళ్లనున్నారు.
తొలిసారిగా ఓ మహిళ, అందులో ఆఫ్రో అమెరికన్ అయిన క్రిస్టినా కోచ్ చంద్రుడి పైకి వెళ్లనున్నారు. క్రిస్టినా కోచ్ ఇంజనీర్ గా ఈ మూన్ మిషన్ లో భాగం కాబోతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆర్టెమిస్ 2 జాబిలి వద్దకు వెళ్లనుంది. కెనడాకు చెందిన జెరెమీ హాన్సెస్ మిషన్ స్పెషలిస్టుగా, యూఎస్ నేవీ ఫైటర్ పైలెట్ రీడ్ వైస్ మాన్ కమాండర్ గా ఈ మిషన్ లో పనిచేయనున్నారు. ఆర్టెమిస్ I మిషన్ విజయవంతంగా డిసెంబర్ 2022లో పూర్తయింది. మానవ రహితంగా సాగిన ఈ యాత్ర తర్వాత ఆర్టెమిస్ 2 ద్వారా నలుగురు వ్యోమగాములను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లనున్నారు.
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
చంద్రుడిపైకి వెళ్లి తిరిగి వచ్చేలా రూపొందించిన ఆర్టిమిస్-1 ప్రయోగాన్ని గతేడాది నాసా నిర్వహించి విజయం సాధించింది. నాసా రెండో ప్రయత్నంగా ఆర్టెమిస్-2 ద్వారా వ్యోమగాములను పంపనుంది. అయితే ఈ సారి చంద్రుడి ఉపరితలం చుట్టూ ఉన్న కక్ష్యలోకి వ్యోమగాములను పంపనుంది. మొత్తం నలుగురు వ్యోమగాముల్లో ముగ్గురు అమెరికాకు చెందని వారు కాగా.. ఒకరు కెనడా దేశస్తుడు. 50 ఏళ్ల క్రితం చివరిసారిగా అపోలో మిషన్ ద్వారా మానవుడు చంద్రుడిపైకి వెళ్లాడు.
ఆర్టెమిస్-2 మొత్తం 10 రోజుల మిషన్. 2024లో నలుగురు వ్యోమగాములను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లాలన్నది, తిరిగి భూమిపైకి సురక్షితంగా తీసుకురావాలన్నది నాసా ప్లాన్. ఇది విజయవంతం అయిన తర్వాత ఆర్టిమిస్ -3 ద్వారా వ్యోమగాములు చంద్రుడిపై ల్యాండ్ అయ్యే ప్రయోగానికి మార్గం సుగమం అవుతుంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!