ఇండియాతో సరిహద్దు పంచుకునే మయన్మార్ దేశంలో మరో సంచలనం చోటుచేసుకుంది. కొన్నేళ్లుగా అంతర్గత కలహాలతో అట్టుడుకుతూ, ప్రస్తుతం సైనిక పాలనలో ఉన్న మయన్మార్లో మాజీ నాయకురాలు, హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్ సాన్ సూకీ జైలులో మగ్గుతున్నారు.
మయన్మార్ కోర్టు నోబెల్ గ్రహీత అంగ్సాన్ సూకీని మూడు నేరారోపణలలో దోషిగా నిర్ధారించింది.. తాజా కేసులలో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండి నిర్బంధంలో ఉన్నారు.. చట్టవిరుద్ధంగా దేశంలోకి వాకీటాకీలను దిగుమతి చేసుకోవడంతోపాటు, కోవిడ్ ఆంక్షలను ధిక్కరించిన కేసుల్లో కోర్టు ఆమెను దోషిగా తేల్చిందని న్యాయశాఖ అధికారి వెల్లడించారు.. అయితే, గత డిసెంబర్లో వివిధ నేరాలకు పాల్పడ్డారంటూ కోర్టు సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా.. ప్రభుత్వం ఆ…