Land Issue: కమ్మగుడలో ఉద్రిక్తత.. యజమానులను భయభ్రాంతులకు చేసిన భూమాఫియా గ్యాంగ్!
- తుర్కయంజాల్ మున్సిపాలిటీలో దారుణం
- కమ్మగుడ భూ వివాదంలో ఇరువర్గాల పరస్పర దాడులు
- దాడిలో పలు బస్సుల అద్దాలు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధి తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కమ్మగుడ భూ వివాదంలో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. దాడిలో పలు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. పలు బస్సుల అద్దాలు ధ్వంసం కాగా.. పలువురికి గాయాలయ్యాయి. వనస్థలిపురం పోలీసుల రంగ ప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
కమ్మగూడ సర్వే నంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో ప్లాట్స్ ఓనర్స్, పట్టదారులకు మధ్య గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో శివాజీ నగర్ ఫేజ్-2లోని 240, 241, 242లో ప్లాట్ల యజమానులను భూమాఫియా గ్యాంగ్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. 1984లో శివాజీనగర్ ఫేజ్-2 కాలనీలో కొనుగోలు చేసినటువంటి దాదాపు 400 మంది ప్లాట్ యజమానులను కొంతమంది భూబకసురులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్లాట్స్ మావి అంటూ.. ఇందులోకి రావద్దని భూబకసురులు గుండాలను పోగుచేసుకొని తెల్లవారుజామున కబ్జాలోకి రావటానికి ప్రయత్నం చేశారు. ప్లాట్స్ యజమానులు తిరగబడటంతో.. ఇరు వర్గాల మధ్య రాళ్ళ దాడి జరిగింది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
వేధింపులు తాళలేని ప్లాట్స్ యజమానులు పక్కనే ఉన్న పలు బైక్లకు నిప్పు పెట్టారు. దాంతో భూబకసురులు కాస్త వెనకడుగు వేశారు. ఇరు వర్గాల మధ్య దాడిలో పలు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు హుటాహుటిన శివాజీ నగర్ ఫేజ్-2కు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!