Titan Tragedy: అప్పుడు “టైటానిక్”, ఇప్పుడు “టైటాన్ ట్రాజెడీ”పై సినిమా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Titan Tragedy: టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు వెళ్లిన ‘టైటాన్’ సబ్మెర్సిబుల్ ఈ ఏడాది జూన్లో ప్రమాదానికి గురైంది. అట్లాంటిక్ సముద్రంలో దాదాపుగా 4 కిలోమీటర్ల అడుగులో ఒక్కసారిగా ఇన్ప్లోజన్ అనే పేలుడుకు గురైంది. ఈ ప్రమాదంలో అందులో ప్రమాణిస్తున్న ఐదుగురు మరణించారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో టైటానిక్ షిప్ ఇదే ప్రాంతంలో ప్రమాదానికి గురై వందలమంది ప్రయాణికులు మరణానికి కారణమైంది. దానిని చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్మెర్సిబుల్ కూడా ప్రమాదానికి గురవ్వడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని కలిగింది.
ఇదిలా ఉంటే దీనిపై సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషాదకర సంఘటనను ‘ బ్లాకెనింగ్’ నిర్మాత ఇ బ్రియాన్ డాబిన్స్ మరియు మైండ్రైట్ ఎంటర్టైన్మెంట్ కలిసి రూపొందిస్తున్నట్లు వెరైటీ అవుట్లెట్ ఓ నివేదికలో తెలియజేసింది. డాబిన్స్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తారని, మాక్గ్రెరర్-జోనాథన్ కీసీలు కథను సిద్ధం చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
Also Read
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
టైటాన్ ట్రాజెడీపై రూపొందుతున్న తొలి ఫీచర్ ఫిల్మ్ ఇదే. అంతకుముందు యూకేకు చెందిన ఛానెల్ 5 దీనిపై ‘టైటానిక్ సబ్: లాస్ట్ ఎట్ సీ’ పేరుతో డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దీనికి టైటానిక్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే దీన్ని ఆయన కొట్టిపారేశారు.
ఈ ఏడాది జూన్ నెలలో ఓషన్ గేట్ సంస్థ తన టైటాన్ సబ్మెర్సిబుల్ ద్వారా ఓషన్ గేట్ సీఈఓ స్టాక్టన్ రష్, బ్రిటీష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, బ్రిటిష్-పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్ అతని 19 ఏళ్ల కొడుకు సులేమాన్, ఫ్రెంచ్ నేవీ మాజీ డైవర్ పాల్ హెన్రీ నార్గోలెట్ ఈ ఐదుగురు టైటాన్ ద్వారా టైటానిక్ శిథిలాలను చూసేందుకు అట్లాంటిక్ సముద్రంలోకి వెళ్లారు.
అయితే దాదాపుగా గంటన్నర ప్రయాణం తర్వాత 4 కిలోమీటర్ల లోతుకు చేరగానే టైటాన్ నీటి ఒత్తడిని తట్టుకోలేక ఒక్కసారిగా పేలిపోయింది. క్షణాల వ్యవధిలో ఈ ప్రమాదం సంభవించడంతో అందులో ఉండే ప్రయాణికులకు తాము చనిపోతున్నామనే విషయం కూడా తెలియకుండా పోయింది. టైటాన్ ఆచూకీ కోసం నాలుగు రోజుల వెతుకులాట తర్వాత అట్లాంటిక్ అడుగు భాగాన శిథిలాలను గుర్తించి పైకి తీసుకువచ్చారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!