Pakistan: “ఢిల్లీ నుంచి పాకిస్తాన్ను రక్షించేందుకే ఉగ్రవాదం”.. జైషే ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ..
- భారత్ నుంచి పాకిస్తాన్ ను రక్షించేందుకే ఉగ్రవాదం..
- పాకిస్తాన్ ఉగ్ర లింకుల్ని బయటపెట్టిన జైషే ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ..
- మసూద్ అజార్ కుటుంబాన్ని భారత్ హతమార్చిందని కామెంట్స్..
Pakistan: జైషే మహ్మద్ ఉగ్రసంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత వారం పాకిస్తాన్లోని బాలాకోట్ తహసీల్ లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమం ఉగ్రవాది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్లో జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్న బహవల్పూర్పై భారత వైమానిక దళం దాడులు చేసింది. ఈ దాడిలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు హతమయ్యారు. భారత్ ‘‘అజర్ కుటుంబాన్ని హతమార్చింది’’ని కాశ్మీరీ అంగీకరించారు.
2016లో పంజాబ్లోని పఠాన్కోట్లోని భారత వైమానిక దళ స్థావరంపై , జమ్మూ కాశ్మీర్లోని ఉరీలోని ఆర్మీ శిబిరంపై జరిగిన రెండు దాడులతో సహా భారతదేశంపై బహుళ ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉన్నత స్థాయి సభ్యుడు మసూద్ ఇలియాస్ కాశ్మీరీ చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్గా మారింది.
Also Read
Read Also: Pakistan: మధ్యవర్తిత్వానికి భారత్ ఒప్పుకోలేదు.. ట్రంప్ వాదనలపై పాక్ మంత్రి సంచలనం..
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ను ఉగ్రవాదిగా ముద్రవేయడాన్ని కాశ్మీరీ తీవ్రంగా వ్యతిరేకించారు. పాకిస్తాన్ తరుపున ఉగ్రవాదానికి పాల్పడ్డామని ఇతను అంగీకరించాడు. ‘‘ఉగ్రవాదాన్ని స్వీకరించి, ఈ దేశ (పాకిస్తాన్) సరిహద్దులను రక్షించడానికి మేము ఢిల్లీ, కాబూల్, కాందహార్లతో పోరాడాము. అన్నింటినీ త్యాగం చేసిన తర్వాత, మే 7న, బహవల్పూర్లో భారత దళాలు మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేశాయి’’ అని కాశ్మీరీ చెబుతున్నట్లు వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.
భారత మోస్ట్ వాంటెడ్ మసూద్ అజార్:
మసూద్ అజార్ భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరు. 2001 పార్లమెంట్ అటాక్, 26/11 ముంబై దాడుల్లో ప్రత్యక్ష ప్రమేయం ఉంది. 2019లో ఐక్యరాజ్యసమితి ఇతడిని ప్రపంచ ఉగ్రవాదిగా నియమించింది. 1999లో ఇండియన్ ఎయిల్ లైన్స్ IC-814 కాందహార్ హైజాక్ తర్వాత, ఇతడిని భారత్ విడిచిపెట్టింది. అప్పటి నుంచి పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతూ, భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
🚨 #Exclusive 🇵🇰👺
Jaish-e-Mohamad top commander Masood ilyas kashmiri admits that On 7th May his leader Masood Azhar's family was torn into pieces in Bahawalpur attack by Indian forces.
Look at the number of gun-wielding security personnel in the background. According to ISPR… pic.twitter.com/OLls70lpFy
— OsintTV 📺 (@OsintTV) September 16, 2025
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!