Pakistan: “ఢిల్లీ నుంచి పాకిస్తాన్ను రక్షించేందుకే ఉగ్రవాదం”.. జైషే ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ..
- భారత్ నుంచి పాకిస్తాన్ ను రక్షించేందుకే ఉగ్రవాదం..
- పాకిస్తాన్ ఉగ్ర లింకుల్ని బయటపెట్టిన జైషే ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ..
- మసూద్ అజార్ కుటుంబాన్ని భారత్ హతమార్చిందని కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: జైషే మహ్మద్ ఉగ్రసంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత వారం పాకిస్తాన్లోని బాలాకోట్ తహసీల్ లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమం ఉగ్రవాది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్లో జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్న బహవల్పూర్పై భారత వైమానిక దళం దాడులు చేసింది. ఈ దాడిలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు హతమయ్యారు. భారత్ ‘‘అజర్ కుటుంబాన్ని హతమార్చింది’’ని కాశ్మీరీ అంగీకరించారు.
2016లో పంజాబ్లోని పఠాన్కోట్లోని భారత వైమానిక దళ స్థావరంపై , జమ్మూ కాశ్మీర్లోని ఉరీలోని ఆర్మీ శిబిరంపై జరిగిన రెండు దాడులతో సహా భారతదేశంపై బహుళ ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉన్నత స్థాయి సభ్యుడు మసూద్ ఇలియాస్ కాశ్మీరీ చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్గా మారింది.
Also Read
- IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
- Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
- Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
Read Also: Pakistan: మధ్యవర్తిత్వానికి భారత్ ఒప్పుకోలేదు.. ట్రంప్ వాదనలపై పాక్ మంత్రి సంచలనం..
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ను ఉగ్రవాదిగా ముద్రవేయడాన్ని కాశ్మీరీ తీవ్రంగా వ్యతిరేకించారు. పాకిస్తాన్ తరుపున ఉగ్రవాదానికి పాల్పడ్డామని ఇతను అంగీకరించాడు. ‘‘ఉగ్రవాదాన్ని స్వీకరించి, ఈ దేశ (పాకిస్తాన్) సరిహద్దులను రక్షించడానికి మేము ఢిల్లీ, కాబూల్, కాందహార్లతో పోరాడాము. అన్నింటినీ త్యాగం చేసిన తర్వాత, మే 7న, బహవల్పూర్లో భారత దళాలు మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేశాయి’’ అని కాశ్మీరీ చెబుతున్నట్లు వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.
భారత మోస్ట్ వాంటెడ్ మసూద్ అజార్:
మసూద్ అజార్ భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరు. 2001 పార్లమెంట్ అటాక్, 26/11 ముంబై దాడుల్లో ప్రత్యక్ష ప్రమేయం ఉంది. 2019లో ఐక్యరాజ్యసమితి ఇతడిని ప్రపంచ ఉగ్రవాదిగా నియమించింది. 1999లో ఇండియన్ ఎయిల్ లైన్స్ IC-814 కాందహార్ హైజాక్ తర్వాత, ఇతడిని భారత్ విడిచిపెట్టింది. అప్పటి నుంచి పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతూ, భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
🚨 #Exclusive 🇵🇰👺
Jaish-e-Mohamad top commander Masood ilyas kashmiri admits that On 7th May his leader Masood Azhar's family was torn into pieces in Bahawalpur attack by Indian forces.
Look at the number of gun-wielding security personnel in the background. According to ISPR… pic.twitter.com/OLls70lpFy
— OsintTV 📺 (@OsintTV) September 16, 2025
తాజావార్తలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరిగింది?
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Hair Care Tips: తలకు నూనె రాస్తే జుట్టు పొడవుగా పెరుగుతుందా? నిజం ఎంత..?
ట్రెండింగ్
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!