Mark Zuckerberg: మార్క్ జుకర్బర్గ్ స్ట్రాంగ్ వార్నింగ్.. పని చేయకపోతే కోతే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mark Zuckerberg Gives Warning To Meta Directors Managers: గతేడాదిలోనే మెటా సంస్థ ఏకంగా 11 వేల ఉద్యోగుల్ని తొలగించి అందరినీ షాక్కి గురి చేసింది. ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ వ్యవహారశైలి చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరిన్ని లేఆఫ్స్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఆయన తాజాగా కంపెనీలోని మేనేజర్లు, డైరెక్టర్లకు ఇచ్చిన వార్నింగే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. గత వారం కంపెనీలో ఓ అంతర్గత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జుకర్బర్గ్ మాట్లాడుతూ.. మేనేజర్లు, డైరెక్టర్లకు హెచ్చరికలు జారీ చేశారు. కేవలం సిబ్బందితో పని చేయించడమే కాకుండా, పనిలో వ్యక్తిగత పాత్ర ఉండాల్సిందేనని తీర్మానించారు. ఈ ఏడాది మరింత ఎఫీషియెన్సీ కనబరచాల్సిందేనని టార్గెట్ ఇచ్చారు. లేకపోతే.. రాజీనామా చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో.. మెటా ఉద్యోగుల్లో ఇప్పుడు లేఆఫ్ భయాందోళనలు అలుముకున్నాయి. కాగా.. గతేడాది ఉద్యోగుల్ని తొలగిస్తున్న సమయంలో.. మరింత ఎఫీషియన్సీ దిశగా పని చేయనున్నట్టు జుకర్బర్గ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే!
Twitter Blue: భారత్లోనూ బ్లూటిక్ వెరిఫికేషన్.. నెలవారీ రుసుం ఎంతంటే?
Also Read
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Sheikh Hasina: "నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు": షేక్ హసీనా
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
కాగా.. ఖర్చుల భారం తగ్గించుకోవడం కోసం ప్రైవేట్ సంస్థలు వరుసగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కరోనా సమయంలో పని నిమితం ఎక్కువ ఉద్యోగుల్ని తీసుకున్న సంస్థలు.. ఇప్పుడు కాస్ట్ కటింగ్లో భాగంగా లేఆఫ్స్ ప్రారంభించాయి. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ లేఆఫ్ బాట పట్టిన సంగతి విదితమే. ఇదిలావుండగా.. జుకర్బర్గ్ ఇచ్చిన లేటెస్ట్ వార్నింగ్పై బ్లూమ్బర్గ్ ఒక నివేదిక జారీ చేసింది. ఇకపై మెటా కంపెనీలోని సీనియర్ మేనేజర్లు సైతం కింద స్థాయి ఉద్యోగులతో కలిసి తప్పకుండా పనిచేయాల్సి ఉంటుంది. కోడింగ్, డిజైనింగ్, రీసెర్చ్ వంటి వాటిపై దృష్టి పెట్టాల్సిందే! అలా కాకుండా కేవలం ఇన్చార్జ్లుగా ఉంటామంటే మాత్రం కుదరదు. నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తొలగించేస్తారు. ఆల్రెడీ ఉద్యోగుల పనితీరుపై కంపెనీలో నిరంతర సమీక్షలు కొనసాగుతున్నాయని తెలిసింది. ఈ సమీక్షల్లో భాగంగా.. పెర్ఫార్మెన్స్ని బట్టి ఉద్యోగుల్ని తొలగించాలా? లేదా? అనేది తుది నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి.. ఇకనుంచి అందరూ మెడలు వంచి పని చేయాల్సిందే!
Kakani Govardhan Reddy: కాకాణి స్ట్రాంగ్ కౌంటర్.. కోటంరెడ్డి ద్రోహం చేశాడు
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!